News February 18, 2025

VZM: టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపెవరిది..!

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈనెల 27న జరగనున్నాయి. పీడీఎఫ్ అభ్యర్థిగా యూటీఎఫ్ నేత కె.విజయగౌరి మొదటిసారి బరిలో ఉండగా పీ.ఆర్.టీ.యూ నుంచి రెండుసార్లు ఎమ్మెల్సీగా పని చేసిన గాదె శ్రీనివాసులునాయుడు మూడోసారి, ఏపీటీఎఫ్ అభ్యర్థిగా సిట్టింగ్ MLC పాకలపాటి రఘువర్మ రెండోసారి బరిలో ఉన్నారు. ముగ్గురు అభ్యర్థులలో ఎవరికి ఉపాధ్యాయులు పట్టం కడతారోనని ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు.

Similar News

News December 15, 2025

VZM: ‘చిన్న పత్రికలకు చేయూత ఇవ్వాలి’

image

చిన్న, మధ్య తరహా పత్రికలకు మద్దతు ఇవ్వాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌ రాం సుందర్ రెడ్డికి విలేకరుల బృందం సోమవారం వినతిపత్రం ఇచ్చారు. అక్రిడిటేషన్ సంఖ్య పెంపునకు ఇతర జిల్లాల నుంచి ప్రచురితమవుతున్న విజయనగరం జిల్లాలో పనిచేస్తున్న విలేకరులకు అక్రిడిటేషన్ మంజూరు చేయాలన్నారు. క్యాలెండర్ ప్రకటనల ద్వారా ఆర్థిక భరోసా కల్పించాలనే అంశాలను వినతిలో ప్రస్తావించారు.

News December 14, 2025

VZM: ఎంపికైన కానిస్టేబుళ్లకు ముఖ్య గమనిక..

image

విజయనగరం జిల్లాలో కానిస్టేబుళ్లుగా ఎంపికైన పురుష, మహిళా అభ్యర్థులు సోమవారం ఉదయం 5 గంటలకు జిల్లా పోలీసు కార్యాలయం వద్ద హాజరుకావాలని ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ సూచించారు. అభ్యర్థితో పాటు వారి తల్లిదండ్రులు, సమీప బంధువులు ఇద్దరు కలిపి మొత్తం ముగ్గురు హాజరుకావాలన్నారు. అభ్యర్థులు, కుటుంబసభ్యులకు పోలీసు శాఖ టిఫిన్, భోజన సదుపాయం కల్పిస్తుందని చెప్పారు. పురుష అభ్యర్థులు నీట్ షేవింగ్‌తో రావాలని సూచించారు.

News December 14, 2025

కొత్తవలస: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

కొత్తవలస (M) తుమ్మకాపల్లి ఫైర్ స్టేషన్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గొల్లశంకర్రావు (52) మృతి చెందాడు. వేపాడ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన గొల్ల దారప్పడు, గొల్ల శంకర్రావు ద్విచక్ర వాహనంపై పిల్లలతో విశాఖ బీచ్‌కు వెళ్తున్నారు. వెనుక నుంచి లారీ బలంగా ఢీకొట్టడంతో శంకర్రావు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన దారప్పడును KGHకి తరలించారు. పిల్లలు భవాని, శంకర్ గాయపడ్డారు.