News February 18, 2025

VZM: టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపెవరిది..!

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈనెల 27న జరగనున్నాయి. పీడీఎఫ్ అభ్యర్థిగా యూటీఎఫ్ నేత కె.విజయగౌరి మొదటిసారి బరిలో ఉండగా పీ.ఆర్.టీ.యూ నుంచి రెండుసార్లు ఎమ్మెల్సీగా పని చేసిన గాదె శ్రీనివాసులునాయుడు మూడోసారి, ఏపీటీఎఫ్ అభ్యర్థిగా సిట్టింగ్ MLC పాకలపాటి రఘువర్మ రెండోసారి బరిలో ఉన్నారు. ముగ్గురు అభ్యర్థులలో ఎవరికి ఉపాధ్యాయులు పట్టం కడతారోనని ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు.

Similar News

News March 28, 2025

విజయనగరం: శ్రీ విశ్వావ‌సునామ‌ ఉగాది వేడుక‌ల‌కు ఘ‌నంగా ఏర్పాట్లు

image

శ్రీ విశ్వావ‌సునామ ఉగాది వేడుక‌ల‌ను సంప్ర‌దాయ‌భ‌ద్దంగా నిర్వ‌హించేందుకు ఘ‌నంగా ఏర్పాట్లు చేయాల‌ని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్‌.శ్రీ‌నివాస‌మూర్తి కోరారు. ఉగాది వేడుక‌ల నిర్వ‌హ‌ణ‌పై త‌మ ఛాంబ‌ర్‌లో వివిధ శాఖ‌ల అధికారుల‌తో గురువారం సమావేశమయ్యారు. రాష్ట్ర‌ప్ర‌భుత్వ ఆదేశాల‌కు అనుగుణంగా క‌లెక్ట‌ర్ అంబేడ్కర్ సూచ‌న‌ల మేర‌కు ఈనెల 30వ తేదీన ఉగాది వేడుక‌ల‌ను క‌లెక్ట‌రేట్లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు.

News March 27, 2025

విజయనగరం జిల్లాపై సీఎం స్పెషల్ ఫోకస్

image

విజయనగరం జిల్లాలో సాగునీటి కష్టాలు తీరనున్నాయి. ప్రధాన ప్రాజెక్టులైన తోటపల్లికి రూ.105కోట్లు, తారకరామసాగర్‌కు రూ.807కోట్లు ఇవ్వనున్నట్లు CM చంద్రబాబు ప్రకటించారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో జిల్లాలోని సాగునీటి వనరులపై CM ఆరా తీశారు. ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులు పూర్తిచేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే సెంట్రల్ ట్రైబుల్ యునివర్సిటీకి రూ.29కోట్లు ఇస్తామన్నారు.

News March 27, 2025

VZM: ‘ధాన్యం కొనుగోలు కేంద్రాలను మూసివేస్తున్నాం’

image

ఖరీఫ్ 2024-25 సీజన్‌కు గాను జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ చివరి దశకు చేరుకున్నందున ఈనెల 31న కేంద్రాలను మూసి వేస్తున్నామని కలెక్టర్ అంబేడ్కర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 487 కేంద్రాల నుంచి 3.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, రైతుల ఖాతాల్లో మద్దతు ధర రూ.768 కోట్లు, GLT చెల్లింపులకు రూ.12కోట్లు జమ చేశామన్నారు. రైతులు వద్ద ధాన్యం ఉంటే నిర్ణీత గడువులోగా విక్రయించాలన్నారు.

error: Content is protected !!