News July 17, 2024

VZM: డిగ్రీ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో మార్పులు

image

ఏయూ పరిధిలో డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువును జులై 25వ తేదీ వరకు పొడిగించారు. స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జులై 23 నుంచి 25 వరకు జరుగుతాయి. కోర్సులు, కళాశాలల ఎంపికకు వెబ్ ఆప్షన్స్ నమోదు జులై 26 నుంచి 29 వరకు ఉంటుంది. వెబ్ ఆప్షన్ మార్చుకోవడానికి జులై 30న అవకాశం ఇచ్చారు. ఆగష్టు 3న సీట్ల కేటాయింపు ఉంటుంది.

Similar News

News October 30, 2025

ముంపు గ్రామాల్లో పంటల పరిస్థితి తెలుసుకున్న కలెక్టర్

image

మొంథా తుఫాన్ ప్రభావంతో మడ్డువలస డ్యాం గేట్లు ఎత్తివేయడంతో నాగావళి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి గురువారం రేగిడి మండలం సంకిలి బ్రిడ్జి వద్ద నాగావళి నది ప్రవాహాన్ని పరిశీలించారు. ముంపు ప్రభావిత గ్రామాల్లో పంటల నష్టం, ప్రజల స్థితిగతులపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. పరివాహక ప్రాంత ప్రజలకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు.

News October 30, 2025

డెంకాడ: నేలకొరిగిన వరి పంట పరిశీలించిన ఉన్నతాధికారులు

image

డెంకాడ మండలం చొల్లంగిపేట గ్రామపంచాయతీ పరిధిలోని మొంథా తుఫాను ప్రభావంతో నష్టపోయిన వరి పంటను జిల్లా వ్యవసాయ అధికారి వీ.టి. రామారావు గురువారం పరిశీలించారు. ఎంత మేర నష్టం కలిగిందో రైతులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ ఆదేశాలు మేరకు నష్టపోయిన వరి పంట ఎకరాకు రూ. 10,000ల చొప్పున నష్టపరిహారం వచ్చే విధంగా ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని రైతులకు భరోసా కల్పించారు.

News October 30, 2025

ప్రతి నష్టాన్ని అంచనా వేయాలి: కలెక్టర్

image

జిల్లాలోని అన్ని జలాశయాల ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లోలను పర్యవేక్షిస్తూ ఎక్కడా నష్టం జరగకుండా చూడాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి సూచించారు. తుఫాన్, వరద పరిస్థితులపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నీటి స్థాయిలు సాధారణ స్థితికి వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రతి నష్టాన్ని నమోదు చేసి, అంచనా వేయాలని ఆదేశించారు. నివేదికలు సాయంత్రానికి అందజేయాలన్నారు.