News July 30, 2024

VZM: తాగునీటి సమస్యకు టోల్ ఫ్రీ నెంబర్

image

జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలను వెనువెంటనే పరిష్కరించే లక్ష్యంతో కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్టు జేసీ కె.కార్తీక్ చెప్పారు. దీనికి సంబంధించిన పోస్టర్ను సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆవిష్కరించారు. పంచాయతీరాజ్ విభాగం ఆధ్వర్యంలో 95023 49267 టోల్ ఫ్రీ నెంబరుతో కంట్రోల్ రూం పనిచేస్తుందని జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్ రాజా తెలిపారు.

Similar News

News November 27, 2025

గంజాయి కేసులో ఐదుగురికి జైలు శిక్ష: VZM SP

image

డ్రగ్స్ కేసులో ఐదుగురు నిందితులకు 18 నెలల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి మీనాదేవి గురువారం తీర్పు వెలువరించారని విజయనగరం ఎస్పీ దామోదర్ తెలిపారు. విజయనగరంలోని వన్ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో జూలై 26, 2024న పాత రైల్వే క్వార్టర్స్ వద్ద 8 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో సాక్ష్యాలను సమర్పించిన పోలీసు అధికారులను ఎస్పీ అభినందించారు.

News November 27, 2025

VZM: బొత్స భద్రత లోపంపై విచారణకు ఆదేశం

image

పైడితల్లి సిరిమానోత్సవంలో శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణకు కేటాయించిన వేదిక కూలిన ఘటనపై విచారణకు GAD ప్రిన్సిపల్ సెక్రటరీ ముకేష్ కుమార్ మీనా కలెక్టర్‌ను ఆదేశించారు. బొత్స ప్రొటోకాల్, భద్రతా లోపంపై విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని కలెక్టర్ రాం సుందర్ రెడ్డిని ఆదేశిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, వేదిక కూలిన ఘటనలో MLC సురేష్ బాబు, ఎస్సై, మరో బాలికకు గాయాలైన సంగతి తెలిసిందే.

News November 26, 2025

ఐదుగురికి జరిమానా.. మరో ఐదుగురికి జైలు శిక్ష: VZM ఎస్పీ

image

విజయనగరం రూరల్ సర్కిల్ పరిధిలో రూరల్ & గంట్యాడ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడిపిన 10 మంది వ్యక్తులు బుధవారం పట్టుబడ్డారు. పట్టుబడ్డ నిందితులను విజయనగరం ఎక్సైజ్ కోర్టులో హాజరుపర్చగా, 5 మందికి ఒక్కొక్కరికి రూ.10వేలు జరిమానా, మరో 5 మందికి 5 రోజుల జైలు శిక్ష విధిస్తూ మెజిస్ట్రేట్ శ్రీవిద్య తీర్పు వెల్లడించారని ఎస్పీ దామోదర్ తెలిపారు.