News June 4, 2024
VZM: ధ్రువపత్రం అందుకున్న కలిశెట్టి అప్పలనాయుడు
2024 విజయనగరం పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడుకు జిల్లా ఎన్నికల అధికారి నాగమణి గెలుపు ధ్రువపత్రం అందించారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్పై 2,29,216 ఓట్లు మెజార్టీతో విజయనగరం ఎంపీగా గెలిచారు. కలిశెట్టికి మొత్తం 7,18,294 ఓట్లు పడ్డాయి.
Similar News
News October 6, 2024
దళారుల బారిన పడి మోసపోవద్దు: VZM కలెక్టర్
కేజీబీవీలో ఉద్యోగాలకు కొంతమంది దళారులు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ అన్నారు. ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాల ఎంపిక ఉంటుందని, దళారులబారిన పడి అభ్యర్థులు మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. డబ్బులు వసూలు చేస్తున్న వారి వివరాలు తమకి తెలియజేయాలని అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.
News October 6, 2024
విజయనగరం జిల్లా టెట్ అభ్యర్థులకు కీలక UPDATE
విజయనగరం జిల్లాలోని టెట్ అభ్యర్థులకు హాల్ టికెట్, నామినల్ రోల్లో తప్పుల సవరణకు అవకాశం కల్పిస్తున్నట్లు డీఈవో ప్రేమ కుమార్ తెలిపారు. ఇందుకు ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలన్నారు. ఇంటిపేరు, బర్త్ డే మార్పుల కోసం టెన్త్ మార్కుల లిస్ట్, క్యాస్ట్ సర్టిఫికెట్, ఏదైనా గుర్తింపు కార్డును ఎగ్జామ్ సెంటర్ల వద్ద అధికారులకు అందజేయాలని డీఈవో పేర్కొన్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News October 6, 2024
VZM: మంత్రి కొండపల్లికి ఘన స్వాగతం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పెట్టుబడులను ఆహ్వానించేందుకు 10 రోజుల అమెరికా పర్యటన ముగించుకుని విజయనగరం జిల్లా విచ్చేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్కు ఘన స్వాగతం లభించింది. విజయనగరం రైల్వే స్టేషన్ వద్ద గంట్యాడ మండల టీడీపీ అధ్యక్షుడు కొండపల్లి భాస్కరరావు, పార్టీ నాయకులు మంత్రికి స్వాగతం పలికి సత్కరించారు. రాష్ట్ర అభివృద్ధికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.