News April 28, 2024
VZM: నియోజకవర్గాల కేటాయింపు పూర్తి

జిల్లాలో వచ్చే నెలలో జరగనున్న సాధారణ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో భాగంగా PO, APO, OPOల కేటాయింపు ప్రక్రియ శనివారం పూర్తయింది. ఎన్ఐసీలో రాండమైజేషన్ ప్రక్రియ ద్వారా జిల్లాలోని 12, 522 మంది ఎన్నికల సిబ్బందిని నియోజకవర్గాలకు కేటాయించే ప్రక్రియను కలెక్టర్ నాగలక్ష్మి, ఎన్నికల సాధారణ పరిశీలకులు హనీశ్ చాబ్రా, సీతారాం జాట్ తదితరుల సమక్షంలో ఎన్ఐసీ అధికారులు నిర్వహించారు.
Similar News
News November 5, 2025
పెట్టుబడులపై అవగాహన కల్పించండి: మంత్రి కొండపల్లి

విదేశీ పెట్టుబడులను ఆకర్షించే విధానాల అమలు, తదితర అంశాలపై అధికారులతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమరావతి సచివాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. వివిధ దేశాల్లో కీలక స్థానాల్లో ఉన్న తెలుగు ఎన్నారైలతో ప్రత్యేక క్లబ్ ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, పారిశ్రామిక విధానం వివరించి వారికి పెట్టుబడులపై అవగాహన కల్పించాలని అన్నారు.
News November 4, 2025
VZM: ఈ నెల 6న జడ్పీ సర్వ సభ్య సమావేశం

జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ఈనెల 6న ఉదయం 11 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ భవనంలో జరుగనుందని CEO సత్యనారాయణ మంగళవారం తెలిపారు. అక్టోబర్ 29న నిర్వహించాల్సిన సమావేశాన్ని తుఫాన్ కారణంగా వాయిదా వేశామన్నారు. జిల్లా పరిషత్ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నవంబర్ 6న సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు.
News November 4, 2025
పాత నేరస్థుల కదలికలపై నిఘానే కీలకం: VZM SP

జిల్లాలో నేరాలను అరికట్టడంలో పాత నేరస్థుల కదలికలపై నిఘానే కీలకమని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. హిస్టరీ షీటర్లు, పాత నేరస్థులపై ప్రత్యేక బృందాలు కట్టుదిట్టంగా నిఘా పెట్టాలని సూచించారు. రాత్రి గస్తీని ముమ్మరం చేసి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. గంజాయి రవాణా, జూదాలు, కోడి పందాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.


