News January 29, 2025
VZM: నెలకు రూ.45వేలు జీతంతో ఉద్యోగం

జిల్లా కోర్టు పరిధిలో స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ పోస్టు భర్తీ కోసం అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా జడ్జి సాయికళ్యాణ్ చక్రవర్తి బుధవారం తెలిపారు. ఎంపికైన వారికి నెలకు రూ.45వేలు పారితోషికం,రూ.5వేలు రవాణాభత్యం లభిస్తుందన్నారు. న్యాయవాద వృత్తిలో ఐదేళ్ల అనుభవం కలిగిన వారు అర్హులని, పూర్తి వివరాలకు పూల్ బాగ్లో ఉన్న జిల్లా కోర్టును సంప్రదించాలన్నారు.
Similar News
News February 10, 2025
ఉత్తరాంధ్ర టీచర్ MLC స్థానానికి నామినేషన్లు వేసింది వీరే

➤ పాకలపాటి రఘువర్మ
➤ గాదె శ్రీనివాసులు నాయుడు
➤ కోరెడ్ల విజయ గౌరీ
➤ కోసూరు రాధాకృష్ణ
➤ సత్తలూరి శ్రీరంగ పద్మావతి
➤ నూకల సూర్యప్రకాశ్
➤ రాయల సత్యనారాయణ
➤ పోతల దుర్గారావు
➤ పెదపెంకి శివప్రసాద్
➤ సుంకర శ్రీనివాసరావు
NOTE: నేటితో నామినేషన్లకు గడువు ముగిసింది.
News February 10, 2025
బెస్ట్ విలన్ టాలెంట్ అవార్డు అందుకున్న బాడంగి దాసరి

ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’లో బెస్ట్ విలన్ టాలెంట్ అవార్డును బాడంగికి చెందిన దాసరి తిరుపతినాయుడు ఆదివారం అందుకున్నారు. విప్లవ నటుడు ఆర్.నారాయణమూర్తి నటించిన యూనివర్సిటీ చిత్రంలో విలన్’గా దాసరి నటించాడు. బాడంగి మండలం గొల్లాది గ్రామానికి చెందిన తిరుపతినాయుడు డ్రామా ఆర్టిస్టుగా పనిచేసేవారు. సినిమాలో అవకాశం రావడంతో విలన్’గా నటించి అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు.
News February 10, 2025
VZM: 3 లక్షల మందికి ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ

విజయనగరం జిల్లా వ్యాప్తంగా మూడు లక్షల మంది విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తున్నట్లు DMHO డాక్టర్ జీవనరాణి తెలిపారు. ఈ మాత్రల పంపిణీ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం అవుతుందన్నారు. మాత్రలను నమిలి మింగాల్సి ఉంటుందని, దీంతో పిల్లల్లో ఉండే నులి పురుగులు నశించి రక్తహీనత బారిన పడకుండా ఉంటారని తెలిపారు. ఏడాదికి రెండుసార్లు నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.