News March 3, 2025
VZM: నేటి నుంచి ఇంటర్ సెకిండియర్ పరీక్షలు

నేటి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. విజయనగరం జిల్లాలో 177 అన్ని యాజమాన్య కళాశాలల నుంచి 20,368 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 166 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు శనివారం ప్రారంభం అయ్యాయి.
Similar News
News October 16, 2025
VZM: ఆర్టీసీ సేవల్లో సమస్యలపై తెలయజేయండి

ఆర్టీసీ సేవల్లో సమస్యల తెలుసుకునేందుకు నేడు డయల్ యువర్ డీపీటీఓ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రజారవాణాధికారిణి జి.వరలక్ష్మి తెలిపారు. గురువారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఫిర్యాదు స్వీకరించనున్నారు. విజయనగరం జిల్లా పరిధిలో గల ప్రయాణికులు, తమ సలహాలు, సూచనలు, సమస్యలపై 99592 25604 నంబరుకు ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు.
News October 16, 2025
VZM: రైలులో గంజాయితో ఇద్దరు అరెస్టు

ఒడిశాలోని మునిగుడ నుంచి కేరళ తరలిస్తున్న మూడు కిలోల గంజాయి పట్టుకున్నట్ల రైల్వే ఎస్ఐ బాలాజీరావు చెప్పారు. పార్వతీపురం రైల్వే స్టేషన్ నుంచి విజయనగరం రైల్వే స్టేషన్ మధ్యలో ఏర్నాకులం రైలులో తనిఖీలు చేస్తుండగా కేరళకు చెందిన సుని, గోవిందరాజు నుంచి మూడు కిలోల గంజాయి సీజ్ చేసి అరెస్టు చేసినట్లు చెప్పారు. గంజాయి నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని రైల్వే పోలీసులు చెప్పారు.
News October 15, 2025
విజయనగరం జిల్లా రైతులకు విజ్ఞప్తి

పత్తి, మొక్కజొన్న పంటలకు కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు విక్రయించవద్దని జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ అధికారి రవికిరణ్ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత సంవత్సరానికి పత్తి ధర క్వింటాల్కు రూ.8110, మొక్కజొన్న క్వింటాల్కు రూ.2400గా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అక్టోబరు 21 తర్వాత జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. రైతుల ప్రయోజనాలను కాపాడటానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.