News March 1, 2025
VZM: నేటి నుంచే ఇంటర్ పరీక్షలు

ఇంటర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. విజయనగరం జిల్లాలో 177 ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం 20,902, ద్వితీయ సంవత్సరం 20,368మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు ఉదయం 8.30 గంటలకు చేరుకోవాలని ఆర్ఐఓ ఆదినారాయణ చెప్పారు.
Similar News
News March 1, 2025
VZM: 16 మంది మందుబాబులకు షాక్..!

మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై భారీగా జరిమానాలు పడుతున్నాయి. SP వకుల్ జిందల్ ఆదేశాలతో విజయనగరం పట్టణ ట్రాఫిక్ సీఐ సూరినాయుడు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి 16 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. పట్టుబడ్డ వారిని కోర్టులో ప్రవేశపెట్టగా ఒక్కొక్కరికి పదివేలు చొప్పున 16 మందికి రూ.1.60 లక్షల జరిమానాను విధించారని SP శనివారం తెలిపారు. ప్రమాదాలు నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నామన్నారు.
News March 1, 2025
ఎస్.కోట: తల్లి మరణం తట్టుకోలేక కొడుకు ఆత్మహత్య

ఎస్.కోటకి చెందిన వ్యక్తి తల్లి చనిపోయిందనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. CI నారాయణమూర్తి వివరాల ప్రకారం.. మండలంలోని అయితన్నపేటకి చెందిన సంతోశ్ కుమార్(35) తల్లి మూడేళ్ల క్రితం మరణించింది. అప్పటి నుంచి మనస్తాపానికి గురైన సంతోశ్ ఫిబ్రవరి 25న మందులో పురుగుమందు కలుపుకొని తాగాడు. దీంతో అతడిని ఎస్.కోట ఆస్పత్రికి తరలించాడు. అక్కడి నుంచి విజయనగరం తరలించగా చికిత్స పొందతూ శుక్రవారం మృతిచెందాడు.
News March 1, 2025
పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

దత్తిరాజేరు మండలం వంగర గ్రామానికి చెందిన మామిడి పెంటయ్య శుక్రవారం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పెదమానాపురం ఎస్ఐ జయంతి తెలిపారు. మృతుడి బార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు. తరచు తాగి వస్తుండటంతో ఇలా అయితే మీ ఆరోగ్యం చెడిపోతుందని భార్య మందలించడంతో మనస్తాపం చెంది, అశరబంద చెరువు వద్ద పురుగు మందు తాగినట్లు తెలిపారు. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా బొండపల్లి వద్ద చనిపోయినట్లు పేర్కొన్నారు.