News February 6, 2025
VZM: న్యాయమూర్తులతో వీడియో కాన్ఫెరెన్స్
విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల న్యాయమూర్తులతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ చక్రవర్తి స్థానిక జిల్లా కోర్టు నుంచి గురువారం వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే నెల 8న జరగబోయే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఎక్కువ కేసులను రాజీ చేయాలని సూచించారు. వివిధ కేసులను ఇరు వర్గాల అనుమతితో రాజీ మార్గంలో శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.
Similar News
News February 7, 2025
MNCL: రిక్రూట్మెంట్ ఫౌండేషన్ కోర్సులకు ఉచిత శిక్షణ
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డిగ్రీ ఉత్తీర్ణులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అభ్యర్థులకు రిక్రూట్మెంట్ ఫౌండేషన్ కోర్సులకు ఉచిత అందించనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి పురుషోత్తం తెలిపారు. ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే 4 నెలల ఉచిత శిక్షణలో అభ్యర్థులకు బుక్ ఫండ్, ప్రతి నెల స్టైఫండ్ ఇస్తామన్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 9 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News February 7, 2025
క్రీడాకారులకు రూ.7.96 కోట్ల ప్రోత్సాహకాలు విడుదల
AP: రాష్ట్ర క్రీడాకారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 189 మందికి రూ.7.96 కోట్ల ప్రోత్సాహాలను విడుదల చేసింది. వైసీపీ ప్రభుత్వం 224 మందికి రూ.11.68 కోట్ల ఇన్సెంటీవ్లను పెండింగ్లో పెట్టిందని శాప్ ఛైర్మన్ రవినాయుడు ఆరోపించారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడంతో రూ.7.96 కోట్లను రిలీజ్ చేశారని తెలిపారు.
News February 7, 2025
సంగారెడ్డి: మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యం: ఎస్పీ
జిల్లాలో పూర్తిస్థాయిలో మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎస్పీ రూపేష్ గురువారం తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా మాదకద్రవ్యాలు సరఫరా చేసిన, విక్రయించిన 87126 56777 నంబర్కు తెలపాలని పేర్కొన్నారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ప్రజలు తమకు సహకరించాలని కోరారు.