News March 11, 2025

VZM: పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం..

image

విజయనగరం జిల్లాలో ఓ తల్లి పిల్లలతో కలిసి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన వంగర మండలంలో మంగళవారం జరిగింది. కింజంగి గ్రామానికి చెందిన కళింగ శ్రావణి (30), కుమారుడు సిద్దు (9), కుమార్తె సైని (6)తో కలిసి మడ్డువలస కుడి కాలువలోకి దూకింది. ఇది గమనించిన స్థానికులు తల్లి, కుమారుడిని కాపాడారు. కుమార్తె గల్లంతైంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 12, 2025

VZM: ‘రుణాల రికవరీ వందశాతం ఉండాలి’

image

రుణాల రికవరీ వందశాతం ఉండాలని DRDA పీడీ శ్రీనివాస్‌ పాణి ఆదేశించారు. స్థానిక DRDA కార్యాలయంలో ‘మన డబ్బులు.. మన లెక్కలు’ కార్యక్రమంపై మంగళవారం సమావేశం నిర్వహించారు. రుణాల లక్ష్యాన్ని సిబ్బంది చేరుకోవాలని కోరారు. గ్రామ స్థాయి సిబ్బందితో సమన్వయం తప్పనిసరిగా ఉండాలన్నారు. మహిళల ఆర్థికాభివృద్దిలో భాగస్వామ్యం కావాలని సూచించారు. కార్యక్రమంలో APD సావిత్రి, DPMలు చిరంజీవి, లక్ష్మీ నాయుడు పాల్గొన్నారు.

News November 12, 2025

VZM: నేడు అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నిరసన కార్యక్రమాలు

image

జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నేడు వైసీపీ నిరసన ర్యాలీలు చేపట్టనుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ భాగస్వామ్యానికి అప్పగించేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ర్యాలీలు చేపడుతున్నట్లు జిల్లా పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తల ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయాల వరకు ర్యాలీలు కొనసాగనున్నాయని తెలిపింది.

News November 12, 2025

VZM: నేడు PMAY గృహ ప్రవేశాలు

image

విజయనగరం జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో 8,793 ఇళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా బుధవారం సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం జరగనుందని హౌసింగ్ పీడీ మురళీ తెలిపారు. బొండపల్లి మండలం అంబటివలస గ్రామంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేయనున్నారు. రాజాం, నెల్లిమర్ల, బొబ్బిలి, ఎస్.కోట, చీపురుపల్లి నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేల చేతుల మీదుగా గృహప్రవేశాలు జరుగనున్నాయి.