News February 28, 2025

VZM: పెళ్లి ఇష్టం లేదని ఇంటి నుంచి వెళ్లిపోయాడు

image

విజయనగరంలో ఓ యువకుడు పెళ్లి ఇష్టం లేదని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. CI శ్రీనివాస్ వివరాల ప్రకారం.. నెయ్యిల వీధికి చెందిన పి.సాయికి మార్చిలో వివాహం జరగాల్సి ఉంది. కాగా ఈనెల 24 ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అనంతరం తల్లికి ఫోన్ చేసి పెళ్లి ఇష్టం లేదని చెప్పి కాల్ కట్ చేశాడు. యువకుడి కోసం ఎంత గాలించినా ఆచూకీ లభించకపోవడంతో తల్లి చిట్టెమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వన్ టౌన్ CI కేసు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News November 25, 2025

ఓవర్ కాన్ఫిడెన్స్‌తోనే ఐబొమ్మ రవి దొరికాడు: పోలీసులు

image

TG: ఐబొమ్మ రవికి కష్టపడి జాబ్ చేయాలన్న ఆలోచన లేదని సైబర్ క్రైమ్ అడిషనల్ CP శ్రీనివాస్ వెల్లడించారు. ‘టెక్నాలజీ తెలుసు. ఈజీ మనీ కోసం సినిమాలను పైరసీ చేశాడు. ఓవర్ కాన్ఫిడెన్స్‌తోనే రవి దొరికాడు. అతడి భార్య మాకు సమాచారం ఇచ్చిందనేది అవాస్తవం. బెట్టింగ్, గేమింగ్ యాప్స్ ప్రమోట్ చేసి రూ.20 కోట్ల వరకు సంపాదించాడు. మూవీరూల్జ్, తమిళ్‌ఎంవీ లాంటి పలు పైరసీ సైట్ల నిర్వాహకులను పట్టుకుంటాం’ అని స్పష్టం చేశారు.

News November 25, 2025

భిక్కనూర్: ‘ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి’

image

ప్రభుత్వం అందిస్తోన్న పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ విక్టర్ చెప్పారు. మంగళవారం భిక్కనూర్ మండల కేంద్రంలో నియోజకవర్గంలోని డ్వాక్రా మహిళలకు రూ.మూడున్నర కోట్ల వడ్డీ లేని రుణాలను అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు పోవాలని సూచించారు. మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోందని గుర్తు చేశారు.

News November 25, 2025

కామారెడ్డి: ‘అనధికారిక స్టాకింగ్‌ చేస్తే కఠిన చర్యలు’

image

నిజాంసాగర్ రిజర్వాయర్‌లో రాష్ట్ర ప్రభుత్వం, మత్స్యశాఖ ఆధ్వర్యంలో 100% ఉచిత గ్రాంట్‌తో చేప/రొయ్య పిల్లల పెంపకం కార్యక్రమం చేపడుతోంది. అనధికారిక సంఘాలు సొంతంగా చేప/రొయ్య పిల్లలను వదలడం పూర్తిగా నిషేధించారు. మత్స్య సంపదపై పూర్తి హక్కులు ప్రభుత్వానికే ఉంటాయి. మత్స్యకారులు ప్రైవేటుగా సీడ్ వేసి ఆర్థికంగా నష్టపోవద్దని, చట్టపరమైన ఇబ్బందులు పడొద్దని జిల్లా మత్స్యశాఖ అధికారి డోలి సింగ్ విజ్ఞప్తి చేశారు.