News July 5, 2024

VZM: పోస్టింగులకు కార్యదర్శుల ఎదురు చూపులు..!

image

సరిగ్గా మూడు నెలల క్రితం జిల్లాలో తొమ్మిది మంది గ్రేడ్-2 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్-1 ఉద్యోగులుగా పదోన్నతి లభించింది. ఇప్పటికీ కూడా వారికి పోస్టింగులు ఇవ్వకపోవడంతో ఎదురు చూస్తున్నారు. మార్చి 16 నుంచి జూన్ 6 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున నిబంధనలు అడ్డొచ్చాయి. కోడ్ ముగిసి నెల దాటుతున్నా పోస్టింగులు ఇవ్వకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు.

Similar News

News January 5, 2026

నిత్య జీవితంలో క్రీడలు భాగం కావాలి: కలెక్టర్

image

చింతలవలసలోని ఏపీఎస్పీ 5వ బెటాలియన్‌లో నిర్వహిస్తున్న 37వ వార్షిక క్రీడా పోటీలను కలెక్టర్ రాంసుందర్ రెడ్డి సోమవారం ప్రారంభించి మాట్లాడారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, క్రీడాస్ఫూర్తి, సమష్టి తత్వాన్ని అలవర్చుకునేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో క్రీడలను భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట APSP కమాండెంట్ రవిశంకర్ రెడ్డి ఉన్నారు.

News January 5, 2026

మరికొన్ని గంటల్లో అర్జీలను స్వీకరించనున్న VZM కలెక్టర్

image

జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి సోమవారం విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో PGRS నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొని అర్జీలు స్వీకరిస్తారన్నారు. మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లోనూ అర్జీల స్వీకరణ ఉంటుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

News January 5, 2026

విజయనగరం జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఉదయ్

image

గజపతినగరంకు చెందిన దేవర ఉదయ్ కిరణ్‌ను భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఆదివారం నియమించింది. ఈ మేరకు పార్టీ జిల్లా అద్యక్షుడు రాజేష్ వర్మ తెలిపారు. భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఉదయ్ కిరణ్‌కు అభినందనలు తెలిపారు. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన చెప్పారు.