News February 2, 2025

VZM: ప్రజా సమస్యల పరిష్కార వేదిక తాత్కాలికంగా రద్దు: SP

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కారం వేదిక కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం తెలిపారు. జనవరి 29 నుంచి మార్చి 8 వరకు జిల్లాలో కోడ్ అమల్లో ఉన్నందున ఫిర్యాదులు స్వీకరించమన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని ఎస్పీ కోరారు.

Similar News

News March 13, 2025

VZM: కేంద్ర మంత్రితో ఎంపీ కలిశెట్టి భేటీ

image

ఢిల్లీలోని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రామభద్రపురం నుంచి రాయగడ వరకు నాలుగు లైన్ల రోడ్లుగా మార్చాలని, అలాగే నెల్లిమర్ల జంక్షన్ నుంచి రామతీర్థం మీదగా రణస్థలం రోడ్డును విస్తరించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సమస్యలపై గతంలోనే కేంద్రమంత్రికి విన్నవించామని మరోసారి గుర్తు చేయడం జరిగిందని ఎంపీ తెలిపారు.

News March 13, 2025

పది పరీక్షలు రాసేవారికి ఉచిత ఆర్టీసీ ప్రయాణం

image

విజయనగరం జిల్లాలో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్‌ చెప్పింది. 2024- 25 విద్యా సంవత్సరంలో మార్చి- 17వ తేదీ నుంచి జరగబోయే 10వ తరగతి పబ్లిక్ పరీక్షల కోసం హాజరుకానున్న విద్యార్థులకు పరీక్ష కేంద్రాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తోంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనారాయణ తెలిపారు.

News March 12, 2025

VZM: ‘పీపీ మోడల్‌లో పర్యటకాభివృద్ధికి ముందుకు రావాలి’

image

జిల్లాలో పర్యాటకాభివృద్ధికి పీపీ మోడల్‌లో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చే వారికి అవసరమైన భూమి, ఇతర అనుమతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు.బుధవారం కలెక్టర్ తన ఛాంబర్  కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, బీచ్ టూరిజం , టెంపుల్ టూరిజం, క్రింద ఎవరైనా ముందుకు వస్తే మంచి లాభదాయకంగా ఉంటుందని తెలిపారు.

error: Content is protected !!