News January 30, 2025
VZM: ప్రతి రోజూ ఉపాధి పనులు జరగాలి: కలెక్టర్

ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి రోజు ఉపాధి పనులు తప్పక జరగాలని కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు. ఉపాధిహామీ మెటీరియల్ కాంపోనెంట్ పనులు, పనిదినాల కల్పనపై ఎం.పి.డి.ఓ లు, ఫీల్డ్ అసిస్టెంట్లతో తన ఛాంబర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం కలెక్టర్ సమీక్షించారు. ఉన్నది రెండు నెలల గడువేనని, ఈ ఏడాది లక్ష్యాలను పూర్తి చేయకపోతే వచ్చే ఏడాదికి నిధులు రాకపోవచ్చునన్నారు.
Similar News
News October 27, 2025
VZM: జిల్లాలో 122 కొత్త పోలింగ్ కేంద్రాలు

జిల్లాలో 122 కొత్త పోలింగ్ కేంద్రాలకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని DRO శ్రీనివాసమూర్తి తెలిపారు. విజయనగరం కలెక్టరేట్లో అధికారులు, రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. 7 నియోజకవర్గాల్లో.. పోలింగ్ కేంద్రాల స్థాన మార్పు కోసం 23, పేరు మార్పు కోసం 51, కొత్త పోలింగ్ కేంద్రాలుగా 122 ప్రతిపాదనలు గుర్తించబడినట్లు చెప్పారు. ఈ ప్రతిపాదనలు భారత ఎన్నికల సంఘానికి పంపనున్నట్లు వెల్లడించారు.
News October 27, 2025
VZM: జర్మనీలో ఉద్యోగాలకు 30న జాబ్ మేళా

విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జి.ప్రశాంత్ కుమార్ తెలిపారు. జర్మనీలో ఐటీఐ ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో 2 సంవత్సరాల అనుభవం ఉన్న అభ్యర్థుల కోసం అక్టోబర్ 30న విజయనగరం గవర్నమెంట్ ఐటీఐ కాలేజీలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.2.60 లక్షల వరకు టాక్స్ ఫ్రీ వేతనం, ఉచిత వసతి, వైద్యం, రవాణా సదుపాయం కల్పించబడుతుందని ఆయన తెలిపారు.
News October 27, 2025
మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు

మొంథా తుఫాన్ ప్రభావంతో పలు రైళ్లను రద్దు చేస్తూ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. బొబ్బిలి రైల్వే స్టేషన్ మీదుగా రాకపోకలు చెసే విశాఖ – కోరాపుట్ – విశాఖ పాసింజర్&ఎక్సప్రెస్, గుంటూరు – రాయగడ – గుంటూరు ఎక్సప్రెస్ను రైల్వే అధికారులు రద్దు చేశారు. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురవనుండటంతో రైళ్లను రద్దు చేసినట్లు సీనియర్ డివిజనల్ కమర్శియల్ మేనేజర్ చెప్పారు.


