News June 15, 2024

VZM: ప్రభుత్వ కార్యాలయాల ఆస్తి పన్ను బకాయిలు ఎంతంటే..

image

జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలు ఏళ్ల కాలం నుంచి ఆస్తి పన్ను చెల్లించకపోవడంతో బకాయిలు పెరిగిపోతున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం జిల్లా కలెక్టర్ కార్యాలయం రూ.2.80 కోట్లు, హౌసింగ్ డీఈ కార్యాలయం రూ.2.10 కోట్లు, తపాలా శాఖ కార్యాలయం రూ.1.13 కోట్లు, జిల్లా పరిశ్రమల కేంద్రం రూ.62.95 లక్షలు, జిల్లా కోర్టు రూ.3.93 కోట్లు రావాల్సి ఉంది. వడ్డీతో కలిపితే రెట్టింపు బకాయిలు చెల్లించాల్సి ఉంది.

Similar News

News October 2, 2024

ఏపీలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: మంత్రి కొండపల్లి

image

ఏపీలో ఎన్ఆర్ఐలు పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయమని ఏపీ MSME, NRI సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. డల్లాస్‌లోNRI తెలుగుదేశం ఆధ్వర్యంలో ఇన్వెస్టర్స్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగిస్తూ ప్రభుత్వ ఆధ్వర్యంలో త్వరలోనే ఒక పోర్టల్ ప్రారంభిస్తున్నామని, దీని ద్వారా పెట్టుబడులు పెట్టేవారు అన్ని రకాల అనుమతులు పొందడం సులభతరం అవుతుందని వెల్లడించారు.

News October 2, 2024

విజయనగరంలో బస చేసిన మహాత్ముడు.. ఎప్పుడంటే

image

మహాత్మా గాంధీకి విజయనగరంతో విడదీయరాని అనుబంధం ఉంది. ఆయన మూడుసార్లు విజయనగరంలో పర్యటించారు. 1921 మార్చి 30న మొదటి సారి ఇక్కడకు రాగా, 1929 ఏప్రిల్ 30న రెండోసారి వచ్చారు. ఇక మూడోసారి 1933 డిసెంబరు 28, 29 తేదీల్లో రెండురోజుల పాటు విజయనగరంలో పర్యటించారు. అప్పట్లో 5వ నంబరు బంగ్లాగా పిలిచే ప్రస్తుత అశోక్ బంగ్లాలో ఆయన బస చేశారు. ఇప్పటికీ ఆ జ్ఞాపకాలు బంగ్లాలో కనిపిస్తాయి.

News October 2, 2024

VZM: రేపటి నుంచి టెట్ ఆన్లైన్ పరీక్షలు.. జిల్లాలో ఐదు కేంద్రాలు

image

రేపటి నుంచి ఈ నెల 21 వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకు గాను జిల్లాలో 5 కేంద్రాలు ఏర్పాటు చేశారు. రెండు పూటలా ఉదయం 9.30 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 .30 నుంచి 5 గంటల వరకు ఆన్లైన్‌లో పరీక్షలు జరుగుతాయి. మొత్తం 22,889 మంది అభ్యర్ధులు టెట్ పరీక్షలకు హాజరు కానున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షల ఇన్‌ఛార్జ్‌గా ఆర్డీవో దాట్ల కీర్తి వ్యవహరించనున్నారు.