News March 18, 2025

VZM: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చట్టపరమైన చర్యలు

image

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి, ప్రజాశాంతికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ సోమవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా తమ సిబ్బంది ప్రత్యేక డ్రైవ్ చేపట్టి 283 మంది మందుబాబులపై కేసులు నమోదు చేసారన్నారు. వాహన తనిఖీలు చేపట్టిన పోలీసు అధికారులు రహదారి భద్రత నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులకు ఈ-చలానాలను విధించారని తెలిపారు. ఇకనైనా పద్ధతులను మార్చుకొవాలన్నారు.

Similar News

News March 18, 2025

VZM: 23న జ‌రిగే అక్ష‌రాస్య‌తా ప‌రీక్ష‌కు ఏర్పాట్లు

image

ఈ నెల 23వ తేదీన జిల్లా వ్యాప్తంగా నిర్వ‌హించే ప్రాథమిక అక్ష‌రాస్య‌తా ప‌రీక్ష‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాల‌ని DRDA PD ఎ.క‌ల్యాణ‌చ‌క్ర‌వ‌ర్తి, వ‌యోజ‌న విద్య DD ఎ.సోమేశ్వ‌ర్రావు కోరారు. స్థానిక DRDA స‌మావేశ మందిరంలో వివిధ శాఖ‌ల అధికారుల‌తో స‌మ‌న్వ‌య స‌మావేశాన్ని మంగ‌ళ‌వారం నిర్వ‌హించారు. ఉద‌యం 10 నుంచి సాయంత్రం 5 గంట‌లు మ‌ధ్య ల‌బ్దిదారులు వారికి వీలైన స‌మ‌యంలో పరీక్ష నిర్వహిస్తామన్నారు.

News March 18, 2025

భోగాపురంలో బాంబు పేలి కార్మికుడి మృతి

image

భోగాపురంలో రాళ్లను పేల్చేందుకు ఏర్పాటు చేసిన బాంబు పేలి కార్మికుడు మృతి చెందాడు. ఈ ప్రమాదం సోమవారం జరిగింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనుల్లో భాగంగా రహదారి ఏర్పాటుకు అడ్డంగా ఉన్న బండరాళ్లను తొలగించే క్రమంలో బాంబులు పెడుతుండగా ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో రామచంద్రపేటకు చెందిన కార్మికుడు కొత్తయ్య మృతి చెందాడు.

News March 18, 2025

VZM: కరెంట్ షాక్‌తో యువకుడి మృతి

image

విజయనగరం జిల్లా బాడంగి మండలంలో కరెంట్ షాక్‌తో యువకుడు మృతి చెందాడు. వేపాడ మండలం డబ్బిరాజు పేటకు చెందిన రామ్‌కుమార్ బొత్సవాని పాలెంలోని బెల్లం క్రషర్‌ వద్ద పనిచేస్తున్నాడు. సోమవారం సాయంత్రం సామగ్రిని వ్యాన్‌లోకి ఎక్కిస్తుండగా విద్యుత్ వైర్లు తగిలాయి. ఈ ప్రమాదంలో రామ్‌కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే బాడంగి సీహెచ్సీకి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

error: Content is protected !!