News January 19, 2025
VZM: భీమిలి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ చిన్న శ్రీను

విజయనగరం జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావుకు మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయన్ను భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా నియమిస్తూ శనివారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. మాజీ మంత్రి మంత్రి ముత్తంశెట్టి రాజీనామాతో ఆ ప్లేస్ను భర్తీ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మజ్జి శ్రీనివాసరావు విజయనగరం వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు.
Similar News
News November 21, 2025
కొత్తవలస MRO అప్పలరాజు సస్పెండ్

కొత్తవలస MRO పి.అప్పలరాజును సస్పెండ్ చేస్తూ కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తవలస మండలంలోని చిన్నపాలెం, కింతలపాలెం, కొత్తవలస గ్రామాల్లో భూములకు సంబందించి మ్యుటేషన్లు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయంటూ PGRS ద్వారా కలెక్టర్కు స్థానికులు ఫిర్యాదు చేయడంతో చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం అక్కడ డిప్యూటీ తహశీల్దార్గా ఉన్న సునీతకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు.
News November 21, 2025
ఏపీ సచివాలయంలో మంత్రి కొండపల్లి సమీక్ష

రాష్ట్రంలో MSME రంగ అభివృద్ధి, క్షేత్ర స్థాయి అధికారుల పనితీరుపై అమరావతి సచివాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు. పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ డైరెక్టర్ శుభం బన్సల్తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. MSMEలకు అందిస్తున్న ప్రోత్సాహం, కొత్త పరిశ్రమల ఏర్పాటుకు చేపడుతున్న చర్యలపై చర్చించినట్లు మంత్రి తెలిపారు.
News November 20, 2025
VZM: ‘ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం పెంచడానికి ప్రణాళికలు’

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షల ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి తవిటి నాయుడు అన్నారు. విజయనగరంలోని RIO కార్యాలయంలో గురువారం మాట్లాడారు. ఫిబ్రవరి 23 – మార్చి 23 వరకు ఇంటర్ పరీక్షలు 66 పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తున్నమన్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.


