News June 12, 2024
VZM: మంత్రివర్గ సమావేశంలో కొండపల్లి

ఉండవల్లి లోని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన మంత్రి వర్గ సమావేశంలో జిల్లాకు చెందిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు పలు అంశాలపై తమతో చర్చించారని మంత్రి కొండపల్లి ఈ సందర్భంగా తెలిపారు. మంత్రిగా నిర్వహించాల్సిన బాధ్యతలపై చంద్రబాబు తమకి అవగాహన కల్పించారని మంత్రి తెలిపారు.
Similar News
News October 27, 2025
తీర ప్రాంతాల్లో పర్యటించిన విజయనగరం కలెక్టర్, ఎస్పీ

భోగాపురం మండలం ముక్కాం గ్రామంలో కలెక్టర్ రాంసుందర్ రెడ్డి, ఎస్పీ దామోదర్ సోమవారం పర్యటించారు. తుఫాను పరిస్థితులను సమీక్షించారు. మత్స్యకారులు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో సముద్రంలోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినందున ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు.
News October 27, 2025
జిల్లా పోలీస్ కార్యాలయానికి రావొద్దు: VZM SP

జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన ‘పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రసల్ సిస్టమ్’ (PGRS) రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఆదివారం ప్రకటించారు. “మొంథా” తుఫాను ప్రభావంతో వాతావరణం ప్రతికూలంగా మారుతున్న నేపథ్యంలో కార్యక్రమాన్ని రద్దు చేశామన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, ఫిర్యాదుదారులు ఎవ్వరూ రావద్దని, తుఫాను సమయంలో ప్రభుత్వ సూచనలు పాటిస్తూ సురక్షితంగా ఉండాలన్నారు.
News October 26, 2025
VZM: తుఫాను కంట్రోల్ రూమ్ పరిశీలించిన ప్రత్యేకాధికారి

విజయనగరం జిల్లా తుఫాను ప్రత్యేకాధికారి రవి సుభాష్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ను ఆదివారం పరిశీలించారు. తుఫాన్ సన్నద్ధతపై వివిధ శాఖలపై ముందస్తుగా సమీక్షించారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలను కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, ఎస్పీ ఏఆర్.దామోదర్, ఇతర అధికారులు ప్రత్యేకాధికారికి వివరించారు.


