News February 5, 2025
VZM: మరికొన్ని రోజుల్లో ‘రూట్’ క్లియర్..!

ఉమ్మడి విజయనగరం జిల్లాలోని దీర్ఘకాలిక సమస్యగా ఉన్న పెదమానాపురం ఫ్లైఓవర్ పనులు ఊపందుకున్నాయి. గత కొంత కాలంగా నత్తనడకగా సాగిన పనులు ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి. ఈ బ్రిడ్జి నిర్మాణంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రత్యేక దృష్టి పెట్టడంతో పనుల వేగం పుంజుకున్నాయి. మరో రెండు నెలల్లో బ్రిడ్జి పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయని స్థానికులు అంటున్నారు.
Similar News
News January 9, 2026
పెరిగిన బంగారం ధరలు, తగ్గిన వెండి రేటు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు పెరగగా, వెండి రేట్లు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.710 పెరిగి రూ.1,38,710కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.650 పెరిగి రూ.1,27,150 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ ధర రూ.4వేలు తగ్గి రూ.2,68,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప మార్పులున్నాయి.
News January 9, 2026
శ్రీకాకుళం: ప్రభుత్వ న్యాయవాదిగా ఇప్పిలి తాత నియామకం

శ్రీకాకుళం జిల్లా కోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా ఇప్పిలి తాతను ప్రభుత్వం నియమించింది. గురువారం సాయంత్రం ఈ ఆదేశాలు వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ పదవిలో తను మూడేళ్లు కొనసాగుతానని చెప్పారు. గతంలో ఈయన నరసన్నపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేశారు. పలువురు న్యాయవాదులు ఆయనను అభినందించారు.
News January 9, 2026
WGL: ‘ఎడిట్’తో నిలువు దోపిడీ..!

భూభారతి పోర్టల్లోని ‘ఎడిట్’ ఆప్షన్ను ఆసరాగా చేసుకుని ఓ కేటుగాడు భారీ మోసానికి తెరలేపాడు. యాదగిరిగుట్టకు చెందిన ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు రిజిస్ట్రేషన్ ఫీజుల రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.లక్షల సొమ్మును రూ.వందలకే మార్చి ఖజానాకు గండికొట్టాడు. ఈ ఘటన జనగామలో వెలుగు చూడగా, తహశీల్దార్ ఫిర్యాదుతో వరంగల్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


