News March 6, 2025

VZM: మాజీ ఎమ్మెల్యే సతీమణి కన్నుమూత

image

అప్పటి సతివాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దివంగత పొట్నూరు సూర్యనారాయణ సతీమణి కనకమ్మ బుధవారం కన్నుముశారు. ఆమె గడిచిన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె పాలవలస సర్పంచ్‌గా కొనసాగుతున్నారు. ప్రజల సందర్శనార్థం పార్ధివదేహాన్ని పాలవలసలోని తన నివాసంలో అందుబాటులో ఉంచారు. గురువారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Similar News

News March 6, 2025

విజయనగరం: ‘లెక్కలు పరీక్షకు 999 మంది గైర్హాజరు

image

విజయనగరం జిల్లాలో 66 కేంద్రాల్లో గురువారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం లెక్కలు పరీక్షకు 999 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని ఆర్‌ఐ‌వోఎం ఆదినారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా లెక్కలు పరీక్షకు 23,044 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా వారిలో 22,045 మంది మాత్రమే హాజరయ్యారని పరీక్ష ఏటువంటి అవాంచనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా జరిగిందని తెలిపారు.

News March 6, 2025

VZM: జిల్లా జడ్జిలతో ప్రధాన న్యాయమూర్తి సమావేశం

image

పట్టణంలోని స్థానిక జిల్లా కోర్టులో జడ్జిలతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 8న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. రాజీకు వచ్చే క్రిమినల్, మోటార్, ప్రమాద బీమా, బ్యాంక్, చెక్ బౌన్స్, తదితర కేసులను ఇరు పార్టీల సమక్షంలో పరిష్కరించలన్నారు.

News March 6, 2025

VZM: ఈ నెల 8 నుంచి 18 వరకు పి-4 సర్వే

image

పబ్లిక్ ప్రైవేటు పీపుల్స్ పార్టిసిపేషన్‌( పి-4) సర్వే ఈ నెల 8 నుంచి 18 వరకు జరుగుతుందని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పి-4 సర్వే పై అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. స్వర్ణాంధ్ర సాధనకు 10 సూత్రాలను ప్రభుత్వం అమలు చేస్తోందని, ప్రధానంగా జీరో పేదరికం లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం పి-4 కార్యక్రమం చేపడుతోందని కలెక్టర్ తెలిపారు.

error: Content is protected !!