News October 28, 2024
VZM: మూడేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం

మూడేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారం చేయబోయాడు. ఈ దారుణ ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. అనకాపల్లికి చెందిన ఓ కుటుంబం గంట్యాడలో ఓ శుభకార్యానికి వచ్చింది. అక్కడ ఆడుకుంటున్న చిన్నారిని 30 ఏళ్ల యువకుడు ఆమెను దగ్గర్లోని తోటలోకి తీసుకెళ్లి అత్యాచారం చేయబోయాడు. చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు నిందితుడిని పట్టుకున్నారు. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించగా సీఐ నర్సింహమూర్తి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News November 18, 2025
VZM: ‘రైతుల ఖాతాల్లో రూ.150 కోట్లు జమ’

సుఖీభవ-పీఎం కిసాన్ పథకం రెండో విడత నిధులను బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం చంద్రబాబు జమ చేయనున్నారని కలెక్టర్ ఎస్.రాం సుందర్ రెడ్డి మంగళవారం తెలిపారు. జిల్లాలో 2,27,700 మంది రైతుల ఖాతాల్లో రూ.150.03 కోట్లు జమ కానున్నాయి. అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి రూ.7,000 (సుఖీభవ రూ.5వేలు, పీఎం కిసాన్ రూ.2వేలు ) చొప్పున జమ అవుతుందని తెలిపారు.
News November 18, 2025
VZM: కలెక్టర్ ఆగ్రహం.. ముగ్గురు సచివాలయ సిబ్బందికి నోటీసులు

రామభద్రపురం సచివాలయాన్ని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు పట్టి, సచివాలయం ద్వారా ప్రజలకు అందుతున్న పలు సేవలను ప్రత్యక్షంగా పరిశీలించారు. తనిఖీ సమయంలో కొంతమంది సిబ్బంది నిర్దేశిత సమయానికి హాజరు కాకపోవడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆయన ఆదేశించారు.
News November 18, 2025
VZM: కలెక్టర్ ఆగ్రహం.. ముగ్గురు సచివాలయ సిబ్బందికి నోటీసులు

రామభద్రపురం సచివాలయాన్ని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు పట్టి, సచివాలయం ద్వారా ప్రజలకు అందుతున్న పలు సేవలను ప్రత్యక్షంగా పరిశీలించారు. తనిఖీ సమయంలో కొంతమంది సిబ్బంది నిర్దేశిత సమయానికి హాజరు కాకపోవడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆయన ఆదేశించారు.


