News February 2, 2025
VZM: యువకుడి సూసైడ్

విజయనగరం యువకుడు శనివారం సూసైడ్ చేసుకున్నాడు. భాస్కరరావు(30) ఫార్మాసిటీలో పనిచేస్తున్నాడు. గాజువాకలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. పక్కింటి యువతి స్నానం చేస్తుండగా వీడియో తీశాడని ఆమె బంధువులు దాడిచేసి అతని తల్లిదండ్రులకు చెప్తామన్నారు. భయపడిన యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. గాజువాక పోలీసులు కేసు నమోదు చేశారు. కొట్టి చంపారని యువకుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
Similar News
News October 16, 2025
IPS ఆఫీసర్ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు

పంజాబ్లోని రోపార్ రేంజ్ DIG, 2009 బ్యాచ్ IPS హర్చరణ్ సింగ్ భుల్లర్ను CBI అరెస్ట్ చేసింది. ₹8లక్షలు లంచం తీసుకుంటూ ఆయన అధికారులకు పట్టుబడ్డారు. హర్చరణ్ ఇల్లు, ఆఫీసులో సోదాలు చేసి ₹5Cr నగదు, 1.5kgs జువెలరీ, 22 లగ్జరీ వాచ్లు, ఆడి, మెర్సిడెస్ కార్లు, గన్స్&పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నారు. అతనితో పాటు మధ్యవర్తినీ అరెస్ట్ చేశారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. రేపు వారిని కోర్టులో హాజరుపరచనున్నారు.
News October 16, 2025
గద్వాల: ‘ఇళ్ల నిర్మాణాలపై పురోగతి సాధించాలి’

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ సంతోష్ అన్నారు. గురువారం గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఆయన ఎంపీడీవోలతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అంశాలు, వస్తున్న సమస్యలపై క్షుణ్ణంగా విశ్లేషించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇళ్ల నిర్మాణాలపై అధికారులు ప్రత్యేక దృష్టిని పెట్టాలన్నారు.అధికారులు పాల్గొన్నారు.
News October 16, 2025
JGTL: ‘సీపీఎస్ రద్దు చేసి పాత పింఛన్ పునరుద్ధరించాలి’

ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా సీపీఎస్ (CPS)ను రద్దు చేసి, పాత పింఛన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించాలని రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ సెక్రటరీ జనరల్ ఏనుగు సత్యనారాయణ డిమాండ్ చేశారు. గురువారం జగిత్యాలలో జరిగిన టీజీవో కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెండేళ్లుగా కాలయాపన చేస్తున్న PRC రిపోర్టును వెంటనే తెప్పించుకుని, 51 శాతం ఫిట్మెంట్ ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.