News February 2, 2025

VZM: యువకుడి సూసైడ్

image

విజయనగరం యువకుడు శనివారం సూసైడ్ చేసుకున్నాడు. భాస్కరరావు(30) ఫార్మాసిటీలో పనిచేస్తున్నాడు. గాజువాక‌లో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. పక్కింటి యువతి స్నానం చేస్తుండగా వీడియో తీశాడని ఆమె బంధువులు దాడిచేసి అతని తల్లిదండ్రులకు చెప్తామన్నారు. భయపడిన యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. గాజువాక పోలీసులు కేసు నమోదు చేశారు. కొట్టి చంపారని యువకుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

Similar News

News November 25, 2025

టెంపుల్ కారిడార్ నిర్మాణానికి రూ.380 కోట్లు: TPCC ఛీఫ్

image

రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, లింబాద్రిగుట్ట, బాసరను కలుపుతూ టెంపుల్ కారిడార్ నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.380 కోట్లు మంజూరు చేసింది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ మేరకు ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. ధర్మపురిలో ప్రారంభమై కొండగట్టు, వేములవాడ, భీమ్‌గల్ మీదుగా బాసర వరకు ఈ కారిడార్ నిర్మిస్తారని ఆయన ప్రకటించారు.

News November 25, 2025

MHBD: రుణాలు సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

image

మహిళలు రుణాలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. మహిళల ఆర్థిక అభివృద్ధి సంక్షేమం కోసం స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ, ఇందిర మహిళ చీరల పంపిణీ MHBD పట్టణంలో నిర్వహించారు. అనంతరం వడ్డీ లేని రుణాలు రూ.2.70 కోట్ల చెక్కులను పంపిణీ చేశారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నారు.

News November 25, 2025

పిల్లలు నూడుల్స్, పాస్తా తింటే కలిగే నష్టాలు తెలుసా?

image

రిఫైన్డ్ ఫ్లోర్‌తో తయారు చేసే నూడుల్స్, పాస్తా తింటే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. వీటిలో ఉండే అధిక సోడియంతో పిల్లల్లో బీపీ, గుండె, కిడ్నీ సమస్యలు వస్తాయి. మెటబాలిక్ సిండ్రోమ్ రిస్క్ పెరిగి డయాబెటిస్, హై కొలెస్ట్రాల్‌కు దారితీస్తుంది. ప్రొటీన్స్, విటమిన్స్, ఫైబర్ తక్కువగా ఉండడంతో ఒబెసిటీ, పోషకాహార లోపం ఏర్పడుతుంది. జీర్ణక్రియ సమస్యలు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.