News February 2, 2025

VZM: యువకుడి సూసైడ్

image

విజయనగరం యువకుడు శనివారం సూసైడ్ చేసుకున్నాడు. భాస్కరరావు(30) ఫార్మాసిటీలో పనిచేస్తున్నాడు. గాజువాక‌లో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. పక్కింటి యువతి స్నానం చేస్తుండగా వీడియో తీశాడని ఆమె బంధువులు దాడిచేసి అతని తల్లిదండ్రులకు చెప్తామన్నారు. భయపడిన యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. గాజువాక పోలీసులు కేసు నమోదు చేశారు. కొట్టి చంపారని యువకుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

Similar News

News March 14, 2025

హనుమకొండ: ఈ నెల 15 నుంచి ఏఐ విద్య బోధన: యోగితా రాణా

image

ఈ నెల 15వ తేదీ నుంచి జిల్లాలలో ఎంపిక చేసిన ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలల్లో కృత్రిమ మేధ ఏఐను వినియోగిస్తూ సులభతరంగా విద్యాబోధన చేసేందుకు చర్యలు చేపట్టాలని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా విద్యా బోధనపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

News March 14, 2025

స్టాలిన్ ప్రభుత్వంపై నిర్మల సీతారామన్ ఫైర్

image

తమిళనాడు బడ్జెట్ పత్రాల్లో <<15745743>>రూపీ(₹) గుర్తును<<>> తొలగించి రూ. అనే అక్షరాన్ని చేర్చడంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఫైరయ్యారు. 2010లో కేంద్రం రూపీ సింబల్‌ను ఆమోదించిన సమయంలో ఎందుకు వ్యతిరేకించలేదని స్టాలిన్ సర్కారును ప్రశ్నించారు. ఇప్పుడు ఈ గుర్తును తిరస్కరించి తమిళ యువత సృజనాత్మకతను విస్మరించారని మండిపడ్డారు. కాగా రూపీ(₹) గుర్తును డిజైన్ చేసింది డీఎంకే నేత కుమారుడు ఉదయ కుమార్ కావడం గమనార్హం.

News March 14, 2025

వైసీపీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శిగా మల్లయ్య యాదవ్

image

వైసీపీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శిగా మల్లయ్య యాదవ్ ఎంపికయ్యారు. గుత్తి మండలం బేతపల్లికి చెందిన వైసీపీ నేతలు సూర్యనారాయణ, ఈశ్వరయ్య, తదితరులు మల్లయ్య యాదవ్‌ను ఆయన నివాసంలో కలిశారు. ముందుగా మల్లయ్యను శాలువాతో సత్కరించి, పూలమాల వేసి సన్మానించారు. రైతుల సమస్యల పట్ల పోరాడుతానన్నారు. తనను ఎంపిక చేసినందుకు వైఎస్ జగన్, గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వైవీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

error: Content is protected !!