News January 29, 2025
VZM: రహదారి భద్రత పట్ల అవగాహన కల్పించాలి: SP

రహదారి భద్రత పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. బుధవారం తన కార్యాలయంలో ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో వచ్చే నెల 15వ తేదీ వరకు రహదారి భద్రత వారోత్సవాలు నిర్వహించాలన్నారు. ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపడుతున్నామని గత ఏడాదిలో జిల్లాలో మొత్తం 60,392 మందిపై ఈ చలానాలు విధించామన్నారు.
Similar News
News February 18, 2025
ఏయూ వైస్ ఛాన్స్లర్కి విశాఖతో అనుబంధమిదే..!

ఏయూ వైస్-చాన్సలర్గా మంగళవారం నియామకం అయిన రాజశేఖర్ విశాఖలో విద్యాభ్యాసం చేశారు. విశాఖలో సెయింట్ ఆంథోనీస్ హైస్కూల్లో పదోతరగతి పూర్తి చేశారు. ఏ.వి.ఎన్. కళాశాలలో ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయనను ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమించారు. అయితే విశాఖతో అనుబంధం ఉన్న వ్యక్తిని వైస్ ఛాన్సలర్గా నియమించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
News February 18, 2025
VZM: టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపెవరిది..!

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈనెల 27న జరగనున్నాయి. పీడీఎఫ్ అభ్యర్థిగా యూటీఎఫ్ నేత కె.విజయగౌరి మొదటిసారి బరిలో ఉండగా పీ.ఆర్.టీ.యూ నుంచి రెండుసార్లు ఎమ్మెల్సీగా పని చేసిన గాదె శ్రీనివాసులునాయుడు మూడోసారి, ఏపీటీఎఫ్ అభ్యర్థిగా సిట్టింగ్ MLC పాకలపాటి రఘువర్మ రెండోసారి బరిలో ఉన్నారు. ముగ్గురు అభ్యర్థులలో ఎవరికి ఉపాధ్యాయులు పట్టం కడతారోనని ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు.
News February 18, 2025
ఎస్.కోటలో రెండు బైకులు ఢీ.. బాలుడు మృతి

శృంగవరపుకోట టౌన్ పరిధిలో రెండు బైకులు ఢీకొన్న ఘటనలో 17ఏళ్ల బాలుడు మృతి చెందినట్లు సీఐ నారాయణమూర్తి తెలిపారు. బద్దు మహేందర్ రెడ్డి తన బండిపై విశాఖ-అరకు హైవే దాటుతుండగా, బాడితబోయిన దుర్గాప్రసాద్(17) బైక్తో ఢీకొట్టాడు. ఈ ఘటనలో తలకు తీవ్రగాయాలతో బాలుడు మృతి చెందగా.. మహేంద్ర రెడ్డి విజయనగరంలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.