News January 28, 2025

VZM: ‘రెవెన్యూ వినతులను త్వరగా పరిష్కరించాలి’

image

రెవెన్యూ సదస్సుల్లో, రీ సర్వే గ్రామ సభల్లో నమోదైన వినతులను త్వరగా పరిష్కరించాలని జేసీ సేతు మాధవన్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా PGRS,రెవిన్యూ, రీ సర్వే వినతులు, ఫ్రీ హోల్డ్ భూములు, POLR తదితర రెవెన్యూ అంశాల పై మండల వారీగా సమీక్షించారు. గత వారం రోజుల్లో రెవెన్యూ వినతుల ప్రోగ్రెస్ మెరుగైందని, రీ సర్వే వినతులు పరిష్కారంలో పురోగతి లేదని అన్నారు.

Similar News

News April 11, 2026

కేజీబీవీలో ప్రవేశాలకు గడువు పొడిగింపు: డీఈవో

image

జిల్లాలోని కేజీబీవీలో 2026-27 ఏడాదికి 6,7,8,9,10, ఇంటర్మీడియట్‌లో ప్రవేశాల దరఖాస్తులను ఈనెల 20 వరకు పొడిగించినట్లు డీఈవో మాణిక్యం నాయుడు తెలిపారు. రేపటితో ప్రవేశాల దరఖాస్తుల ప్రక్రియ ముగిసినప్పటికీ, విద్యార్థుల తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు మరోసారి గడువు పొడిగించినట్లు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ బాలికలు దరఖాస్తు చేసుకోవాలని శుక్రవారం పేర్కొన్నారు.

News April 11, 2026

ప్రజారోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదు: జేసీ

image

ఆహార భద్రతా ప్రమాణాలు పాటించని వాటర్ ప్లాంట్లు, నెయ్యి విక్రయదారులు, స్వీట్, కిరాణా షాపులపై జేసీ సేతుమాధవన్ చర్యలు చేపట్టారు. ఫుడ్ సేఫ్టీ అధికారి నాగుల్ మీరా నిర్వహించిన తనిఖీల్లో నాణ్యత లోపాలు బయటపడటంతో పలువురిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను విచారించిన జేసీ, నిందితుల సమక్షంలో రూ.1,04,000 జరిమానా విధించారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదని హెచ్చరించారు.

News April 11, 2026

ప్రజారోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదు: జేసీ

image

ఆహార భద్రతా ప్రమాణాలు పాటించని వాటర్ ప్లాంట్లు, నెయ్యి విక్రయదారులు, స్వీట్, కిరాణా షాపులపై జేసీ సేతుమాధవన్ చర్యలు చేపట్టారు. ఫుడ్ సేఫ్టీ అధికారి నాగుల్ మీరా నిర్వహించిన తనిఖీల్లో నాణ్యత లోపాలు బయటపడటంతో పలువురిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను విచారించిన జేసీ, నిందితుల సమక్షంలో రూ.1,04,000 జరిమానా విధించారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదని హెచ్చరించారు.