News April 22, 2025

VZM: రేపే పది ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో..!

image

రేపు ఉ.10 గంటలకు పదో తరగతి పరీక్షా ఫలితాలు ప్రకటించనున్నారు. విజయనగరం జిల్లాలో 2,359 పాఠశాలల నుంచి 23,765 మంది పరీక్ష రాయగా వారిలో 12,504 మంది బాలురు, 11,711 మంది బాలికలు ఉన్నారు. రెగ్యులర్ విద్యార్థులు 22,930 మంది కాగా ప్రైవేట్‌గా 835 మంది పరీక్ష రాశారు. మొత్తం 119 సెంటర్లలో పరీక్షలను నిర్వహించారు. ఒక్క క్లిక్‌తో వే2న్యూస్‌లో ఫలితాలను సులభంగా తెలుసుకోవచ్చు. >Share it

Similar News

News September 8, 2025

VZM: కలెక్టరేట్లో నేడు యధావిధిగా PGRS

image

విజయనగరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం యధావిధిగా PGRS జరుగుతుందని కలెక్టర్ అంబేడ్కర్ ఆదివారం తెలిపారు. తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చు అన్నారు. అర్జీదారులు వారి అర్జీలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్ సైట్‌ను కూడా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News September 7, 2025

పిడుగుపాటుతో 30 మేకలు మృత్యువాత

image

వేపాడ మండలం కొండగంగుబూడిలో ఆదివారం సాయంత్రం పిడుగు పడి 30 మేకలు మృతి చెందాయి. వర్షానికి మేకలన్ని చెట్టు దగ్గరికి చేరడంతో పిడుగుపాటుకు గురయ్యాయి. నంది రమేశ్, గలారి పదసాహెబ్, సార ఎర్రయమ్మ సార బుచ్చమ్మకి చెందిన జీవాలు కొండపైన మరణించడంతో జీవనోపాధి కోల్పోయామంటూ వారు వాపోయారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

News September 7, 2025

కేసులు పరిష్కారమయ్యేలా కృషి: VZM SP

image

విజయనగరం జిల్లాలో ఈనెల 13న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యే విధంగా పోలీసు అధికారులు చర్యలు చేపట్టాలని SP వకుల్ జిందాల్ ఆదివారం తెలిపారు. పోలీస్ స్టేషన్ స్థాయిలో రాజీ అయ్యే అవకాశం ఉన్న కేసులను ముందుగా గుర్తించి, ఇందుకుగాను పోలీస్ స్టేషన్ స్థాయిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేసి లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని కోరారు.