News April 27, 2024
VZM: రైలు నుంచి జారిపడి.. ఒడిశా వాసి మృతి

పార్వతీపురం టౌన్ రైల్వే స్టేషన్ వద్ద గుంటూరు-రాయగడ ఎక్స్ ప్రెస్ రైలు నుంచి జారి పడి ఒడిశా రాయగడకు చెందిన నాయుడు సాయి గౌతమ్(25) శనివారం మృతి చెందాడు. గమనించిన స్థానికులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న హెచ్. సీ రత్న కుమార్ ఆధార్ కార్డు ఆధారంగా కుటుంబ సభ్యులకు విషయం చెప్పారు. అనంతంర ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News April 13, 2026
200 మందికి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జైలు: ఎస్పీ

మద్యం తాగి డ్రైవింగ్ చేసే వారికి ఫైన్లతో పాటు జైలు శిక్ష తప్పదని జిల్లా ఎస్పీ ఏఆర్.దామోదర్ హెచ్చరించారు. రామభద్రపురం పోలీసు స్టేషన్ను ఆదివారం ఆయన సందర్శించారు. జిల్లాలో ఇప్పటివరకు 200 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జైలు శిక్షలు వేసినట్లు తెలిపారు. రహదారి ప్రమాదాల నివారణకు అధిక ప్రాధాన్యతనిస్తూ వాహన చట్టాలను పక్కాగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
News April 12, 2026
VZM: కలెక్టరేట్లో రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటలకు విజయనగరంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించనున్నట్లు కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదివారం తెలిపారు. భూ సమస్యల కోసం ప్రత్యేకంగా ‘రెవెన్యూ క్లినిక్’ కూడా నిర్వహిస్తామన్నారు. కలెక్టరేట్కి రాలేని వారు 1100 టోల్ ఫ్రీ నంబర్/ meekosam.ap.gov.in ద్వారా ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ సూచించారు.
News April 12, 2026
విజయనగరం వైద్య కళాశాలలో కొత్త అధ్యాయం!

విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాల మొదటి బ్యాచ్ పీజీ విద్యార్థుల ఓరియెంటేషన్ శనివారం ముగిసింది. జనరల్ మెడిసిన్, సర్జరీ, ప్రసూతి, పిల్లల వైద్యం వంటి విభాగాల్లో 20 మంది విద్యార్థులు చేరారు. ముగింపు వేడుకలో డా. పి.వి. సుధాకర్ హాజరై “కలలను నిజం చేసుకునే దిశగా” అనే అంశంపై ప్రసంగించారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. కొత్త విద్యార్థుల రాకతో కళాశాలలో కోలాహలం నెలకొంది.


