News April 3, 2025
VZM: రైలు నుంచి జారిపడి కానిస్టేబుల్ మృతి

ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడిన కానిస్టేబుల్ బొబ్బిలి రామకోటి(37) చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. జామి మండలానికి చెందిన రామకోటి ప్రస్తుతం కొత్తవలస పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. ఈనెల 1వ తేదీన రామకోటి విశాఖ నుంచి విజయనగరం వస్తున్న సమయంలో కోరుకొండ- విజయనగరం రైల్వే స్టేషన్ మధ్య జొన్నవలస సమీపంలో ప్రమాదవశాత్తు జారి పడటంతో మహారాజు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పోందుతూ మరణించాడు.
Similar News
News April 11, 2025
విజయనగరం జిల్లా విద్యార్థుల్లో ఉత్కంఠ!

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. విజయనగరం జిల్లాలో ఫస్టియర్ 20,902 మంది, సెకండియర్ 18,384 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం 44,531 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
☞ వే2న్యూస్ యాప్లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
News April 11, 2025
విజయనగరం: రైలులో ప్రయాణిస్తూ.. మహిళ మిస్సింగ్

ఈ నెల 4వ తేదీన ట్రైన్ డిబ్రుగఢ్ – వివేక్ ఎక్స్ ప్రెస్ (22503) రైలులో తమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణిస్తూ ఓ మహిళ మిస్సైంది. పలాస రైల్వే స్టేషన్ సమీపంలోకి ట్రైన్ వచ్చినప్పటికే మహిళ తప్పిపోయిందని పశ్చిమ బెంగాల్ డినజ్పూర్ జిల్లాకు చెందిన ప్రహ్లాద్ దాస్ అనే యువకుడు విజయనగరం రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.
News April 11, 2025
విజయనగరం : నేడు పిడుగులతో కూడిన వర్షాలు

విజయనగరం జిల్లాలో శుక్రవారం అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. మిగిలిన జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వాతావరణంలో మార్పులు రైతులను కలవర పెడుతున్నాయి.