News July 9, 2024
VZM: రోడ్డు ప్రమాదంతో వ్యక్తి మృతి

వేపగుంట వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్.కోట మండలం వెంకటరమణపేటకు చెందిన కృష్ణ(37) మృతి చెందాడు. విశాఖలోని ఆసుపత్రిలో ఉన్న బంధువులను పరామర్శించేందుకు వెళ్తుండగా.. బైక్ అదుపుతప్పి ప్రమాదం చోటుచేసుకుంది. తీవ్రగా గాయపడ్డ అతనిని ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా.. కృష్ణ దంపతులకు రెండు నెలల క్రితమే కవల పిల్లలు(ఆడ, మగ)పుట్టారు. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది.
Similar News
News December 5, 2025
1,000 ఎకరాల్లో ఉద్యాన పంటలు: కలెక్టర్

మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా కూరగాయల సాగును పెంచాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి సూచించారు. కలెక్టర్ చాంబర్లో శుక్రవారం ఉద్యాన శాఖపై సమీక్షించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే ఉద్యాన పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. ప్రతి మండలంలో కనీసం 1,000 ఎకరాల్లో ఉద్యాన పంటల అభివృద్ధి జరగాలని, నీటి సదుపాయం లేని చోట రుణాల ద్వారా బోర్వెల్స్ ఏర్పాటు చేసి సాగు పెంచాలని ఆదేశించారు.
News December 5, 2025
VZM: కోర్టు కాంప్లెక్సుల్లో వాష్రూమ్ల నిర్వహణకు టెండర్లు

జిల్లాలోని వివిధ కోర్టు కాంప్లెక్సుల్లో 178 వాష్ రూమ్ల వార్షిక శుభ్రత నిర్వహణకు సీల్డ్ టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. బబిత శుక్రవారం తెలిపారు. 18 మంది క్లీనింగ్ సిబ్బందితో ఈ కాంట్రాక్ట్ ఏడాది కాలం అమలులో ఉంటుందని, ఆసక్తి గల అర్హులైన వారు తమ కొటేషన్లను ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి, విజయనగరానికి సమర్పించాలని కోరారు.
News December 5, 2025
స్క్రబ్ టైఫస్పై ప్రజలకు అవగాహన కల్పించండి: కలెక్టర్

జిల్లాలో స్క్రబ్ టైఫస్పై ప్రజల్లో భయం అవసరం లేదని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. వైద్యశాఖ అధికారులు, సిబ్బందితో శుక్రవారం తన ఛాంబర్లో టెలీ కాన్ఫిరెన్స్ నిర్వహించారు. ఇది పూర్తిగా నయం అయ్యే వ్యాధని, లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. ప్రజలు భయపడకుండా గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.


