News March 28, 2025

VZM: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

image

ఎస్.కోట మండలం కొత్తూరు సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బసనబోయిన కార్తీక్ (21) మృతి చెందాడు. ఇతను తన స్నేహితులతో కలసి ఎస్.కోట నుంచి స్కూటీపై ఎల్.కోట పండక్కి వెళ్తున్న నేపథ్యంలో కొత్తూరు సమీపంలో ఎదురుగా వస్తున్న బైకు ఢీకొట్టింది. స్కూటీపై ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఎస్.కోట పీహెచ్సీకి తరలించగా కార్తీక్ మృతి చెందినట్లు మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు.

Similar News

News April 2, 2025

విశాఖలో హత్యకు గురైన విజయనగరం మహిళ

image

విశాఖపట్నం కొమ్మాది స్వయంకృషినగర్‌లో ప్రేమోన్మాది నవీన్ చేసిన దాడిలో గాయపడ్డ నక్కా దీపిక(20) ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఘటనా స్థలంలోనే ఆమె తల్లి లక్ష్మి (43) మృతి చెందింది. రేగిడి మండలం పుర్లికి చెందిన బాధితురాలి తండ్రి రాజు విశాఖ వలస వచ్చి కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొమ్మాదిలోని స్వయంకృషినగర్‌లో అద్దెకు ఉంటున్నారు. యువతి పెళ్ళికి అంగీకరించకపోవటంతో హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు.

News April 2, 2025

విజయనగరం: ‘ఉద్యాన‌ పంటల సాగు పెంచేందుకు కార్యాచ‌ర‌ణ‌’

image

విజయనగరం జిల్లాలో ఉద్యాన పంట‌ల సాగును పెంచేందుకు 15 రోజుల్లోగా కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ అంబేడ్కర్ అధికారుల‌ను ఆదేశించారు. ప్ర‌స్తుత జిల్లా ప‌రిస్థితులను బ‌ట్టి వ్య‌వ‌సాయ‌, అనుబంధ శాఖ‌ల ద్వారా జిడిపి పెంచేందుకు కృషి చేయాల‌ని ఆయ‌న సూచించారు. ఉద్యాన‌సాగు, సూక్ష్మ సేద్యంపై కలెక్టర్ బుధవారం త‌మ క్యాంపు కార్యాల‌యంలో కలెక్టర్ స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు.

News April 2, 2025

VZM: ‘మహిళల జీవనోపాధి కార్యక్రమాలు మరింత విస్తృతం చేయాలి’

image

మహిళలకు జీవనోపాధి అవకాశాలు, ఆదాయం పెంపొందించే కార్యక్రమాలు మరింత విస్తృత స్థాయిలో చేపట్టేందుకు గల అవకాశాలపై ప్రతిపాదనలు ఇవ్వాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులకు ఆదేశించారు. స్థానిక డీఆర్డీఏ సమావేశ మందిరంలో మంగళవారం సమీక్ష జరిపారు. మహిళలతో రానున్న రోజుల్లో వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు, లాభదాయక పంటల సాగు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆదాయం పెంచే కార్యక్రమాలు చేయాలన్నారు.

error: Content is protected !!