News April 4, 2024

VZM: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

కురుపాం మండలం కాకిలి గ్రామానికి చెందిన కడ్రక సతీశ్ (30), శ్రీకాకుళం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. సతీశ్ శ్రీకాకుళం జిల్లా కీసరజోడులో పెళ్లికి బైక్‌పై వెళ్లాడు. చిన్నబగ్గ- కె గుమ్మడ రోడ్డులో తిరిగి వస్తుండగా, పాలకొండ నుంచి కొత్తూరు వైపు వెళ్తున్న వ్యాన్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనపై కేసు నమోదుచేసినట్లు ఎస్సై జగదీశ్ తెలిపారు.

Similar News

News November 18, 2025

‘మతిస్థిమితం లేని వ్యక్తుల వివరాలను అందించండి’: SP

image

జిల్లాలో రహదారులపై మతిస్థిమితం లేని నిరాశ్రయులకు సహాయం అందించేందుకు ‘మనోబంధు ఫౌండేషన్’ ముందుకు రావడం అభినందనీయమని ఎస్పీ దామోదర్ తెలిపారు. ఫౌండేషన్ వాల్ పోస్టర్‌ను ఎస్పీ కార్యాలయంలో ఆవిష్కరించారు. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తుల వివరాలను www.manobhandhu.org వెబ్‌సైట్‌కి పంపించాలని ఆయన కోరారు. రెడ్ క్రాస్ సహకారంతో బాధితులను హోంలకు తరలించి చికిత్స అందించనున్నట్లు తెలిపారు.

News November 18, 2025

మెరకముడిదాం జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించిన డిప్యూటీ డీఈవో

image

మెరకముడిదాం జిల్లా పరిషత్ పాఠశాలను డిప్యూటీ డీఈవో కె.వి రమణ సోమవారం సందర్శించారు. హాజరు పట్టికను తనిఖీ చేశారు. పాఠశాల ఉపాధ్యాయులతో 10వ తరగతి విద్యార్థుల యాక్షన్ ప్లాన్ సమావేశం చేపట్టారు. విద్యార్థుల సామర్థ్యాలు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం భోజనం మెనూను పరిశీలించి..రుచితో నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని సూచించారు. ఎంఈఓ చంద్రశేఖర్, ప్రధానోపాధ్యాయులు తిరుపతిరావు పాల్గొన్నారు.

News November 17, 2025

రేగిడి ఆమదాలవలస: నదిలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

image

రేగిడి ఆమదాలవలస మండలం తునివాడ గ్రామంలో సోమవారం మధ్యాహ్నం నాగావళి నదిలో చేపల వేటకు వెళ్లి అనంతరం స్నానానికి దిగి గల్లంతైన లక్ష్మణరావు(55) గల్లంతయ్యాడు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, గ్రామస్థులు గాలింపు చర్యలు చేపట్టిన లభించలేదు. ఇవాళ డెడ్ బాడీ ఖండ్యాం నదిలో గుర్తించి ఒడ్డుకు చేర్చారు. పోస్టుమార్టం నిమిత్తం రాజాం ప్రాంతీయ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య , ఇద్దరు, కుమార్తెలు ఉన్నారు.