News March 9, 2025

VZM: విజయవంతంగా జాతీయ లోక్ అదాలత్

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. స్థానిక కోర్టులో శనివారం ఆయన మాట్లాడుతూ.. రాజీయే రాజమార్గం నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. కక్షిదారులకు డబ్బు, సమయం ఆదా చేసామన్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్‌లో మోటార్ ప్రమాద బీమా క్లెయిమ్‌కు సంబంధించి రూ. 70 లక్షల చెక్కును పంపిణీ చేశామన్నారు.

Similar News

News March 19, 2025

VZM: 23న జ‌రిగే అక్ష‌రాస్య‌తా ప‌రీక్ష‌కు ఏర్పాట్లు

image

ఈ నెల 23వ తేదీన జిల్లా వ్యాప్తంగా నిర్వ‌హించే ప్రాథమిక అక్ష‌రాస్య‌తా ప‌రీక్ష‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాల‌ని DRDA PD ఎ.క‌ల్యాణ‌చ‌క్ర‌వ‌ర్తి, వ‌యోజ‌న విద్య DD ఎ.సోమేశ్వ‌ర్రావు కోరారు. స్థానిక DRDA స‌మావేశ మందిరంలో వివిధ శాఖ‌ల అధికారుల‌తో స‌మ‌న్వ‌య స‌మావేశాన్ని మంగ‌ళ‌వారం నిర్వ‌హించారు. ఉద‌యం 10 నుంచి సాయంత్రం 5 గంట‌లు మ‌ధ్య ల‌బ్దిదారులు వారికి వీలైన స‌మ‌యంలో పరీక్ష నిర్వహిస్తామన్నారు.

News March 18, 2025

VZM: 23న జ‌రిగే అక్ష‌రాస్య‌తా ప‌రీక్ష‌కు ఏర్పాట్లు

image

ఈ నెల 23వ తేదీన జిల్లా వ్యాప్తంగా నిర్వ‌హించే ప్రాథమిక అక్ష‌రాస్య‌తా ప‌రీక్ష‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాల‌ని DRDA PD ఎ.క‌ల్యాణ‌చ‌క్ర‌వ‌ర్తి, వ‌యోజ‌న విద్య DD ఎ.సోమేశ్వ‌ర్రావు కోరారు. స్థానిక DRDA స‌మావేశ మందిరంలో వివిధ శాఖ‌ల అధికారుల‌తో స‌మ‌న్వ‌య స‌మావేశాన్ని మంగ‌ళ‌వారం నిర్వ‌హించారు. ఉద‌యం 10 నుంచి సాయంత్రం 5 గంట‌లు మ‌ధ్య ల‌బ్దిదారులు వారికి వీలైన స‌మ‌యంలో పరీక్ష నిర్వహిస్తామన్నారు.

News March 18, 2025

భోగాపురంలో బాంబు పేలి కార్మికుడి మృతి

image

భోగాపురంలో రాళ్లను పేల్చేందుకు ఏర్పాటు చేసిన బాంబు పేలి కార్మికుడు మృతి చెందాడు. ఈ ప్రమాదం సోమవారం జరిగింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనుల్లో భాగంగా రహదారి ఏర్పాటుకు అడ్డంగా ఉన్న బండరాళ్లను తొలగించే క్రమంలో బాంబులు పెడుతుండగా ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో రామచంద్రపేటకు చెందిన కార్మికుడు కొత్తయ్య మృతి చెందాడు.

error: Content is protected !!