News January 24, 2025

VZM: విజయసాయి రాజీనామా..బాధ్యతలు ఎవరికి?

image

వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త విజయసాయిరెడ్డి ఆపార్టీకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. గతంలో ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలను సాయిరెడ్డి చూసుకునేవారు. ఆయనపై వచ్చిన ఆరోపణలతో 2022లో ఇంఛార్జ్ బాధ్యతల నుంచి జగన్ తొలగించారు. ఓటమి తరువాత మళ్లీ ఆయనకే బాధ్యతలు ఇచ్చారు. విజయసాయి రాజీనామాతో ఇప్పుడు ఆ బాధ్యతలు ఎవరికి ఇస్తారనేది ఆసక్తిగా మారింది. బొత్స ఇప్పటికే ఉభయగోదారి జిల్లాలు చూస్తున్నారు.

Similar News

News November 22, 2025

NLG: బాలికపై మాజీ ప్రజాప్రతినిధి లైంగిక దాడి?!

image

తిప్పర్తి మండలంలోని ఓ గ్రామంలో 14ఏళ్ల బాలికపై ఓ మాజీ ప్రజాప్రతినిధి లైంగిక దాడికి యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాలు..గ్రామానికి చెందిన బాలిక ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది.శుక్రవారం స్కూల్‌కు వెళ్లి వచ్చిన బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండగా ఓ మాజీ ప్రజాప్రతినిధి బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. దీనిపై పోలీసులు వివరాలు వెల్లడించాల్సి ఉంది.

News November 22, 2025

మహబూబాబాద్‌లో ఆయనది చెరగని ముద్ర !

image

సుధీర్ రామ్నాథ్ కేకన్ మహబూబాబాద్ జిల్లా వాసులకు సుపరిచితమైన పేరు. విపత్కర పరిస్థితుల్లో నేనున్నానంటూ భరోసా అందించిన ఎస్పీ సుధీర్.. జిల్లాలో సామాన్యుల పట్ల చూపిన ఔదార్యంతో చెరగని ముద్ర వేసుకున్నారు. ప్రధానంగా జిల్లా రైతాంగం యూరియా కోసం, తీర్థ ఇబ్బందులు పడిన సమయంలో తనదైన నేర్పుతో సమస్యను సునాయాసం చేశారు. వృత్తిపరంగా బదిలీపై వెళ్లినప్పటికీ వ్యక్తి పరంగా సామాన్యుల హృదయంలో నిలిచిపోయారు.

News November 22, 2025

కార్ల వేలానికి ఓకే.. నీరవ్ ‌మోదీకి సీబీఐ కోర్టు షాక్

image

బ్యాంకులను మోసం చేసి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి సీబీఐ కోర్టు షాకిచ్చింది. ఆయనకు సంబంధించి ఈడీ సీజ్ చేసిన 2 కార్లను వేలం వేయడానికి స్పెషల్ జడ్జి జస్టిస్ ఏవీ గుజ్‌రాతీ అనుమతించారు. బెంజ్ GLE250 (39 లక్షలు), స్కోడా సూపర్బ్ ఎలిగెన్స్‌ (7.5 లక్షలు) కార్లు వేలం వేసి డబ్బును నేషనలైజ్డ్ బ్యాంక్‌లో డిపాజిట్ చేయాలన్నారు. సీజ్ చేసిన 3 కార్ల వేలానికి అనుమతి కోరగా రెండింటికే అంగీకరించింది.