News January 12, 2025

VZM: విద్యుత్ వైర్ల చోరీకి వెళ్లి మృతి

image

విజయనగరంలోని రామలింగేశ్వర స్వామి ఆలయ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో కరెంట్ వైర్లు దొంగతనానికి వెళ్లి యువకుడు మృతి చెందాడు. శుక్రవారం అర్ధరాత్రి అశోక్ నగర్‌కు చెందిన శంకర్రావు అనే యువకుడు కొంతమంది వ్యక్తులతో కలిసి కరెంట్ వైర్ల దొంగతనానికి వెళ్లి ఐదో అంతస్తులో ఉన్న వైర్లను కత్తిరించాడు. అనంతరం పక్కనే లిఫ్ట్ కోసం ఏర్పాటు చేసిన ఖాళీ ప్రదేశంలో జారిపడి మృతి చెందాడు.

Similar News

News March 12, 2025

VZM: ‘పీపీ మోడల్‌లో పర్యటకాభివృద్ధికి ముందుకు రావాలి’

image

జిల్లాలో పర్యాటకాభివృద్ధికి పీపీ మోడల్‌లో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చే వారికి అవసరమైన భూమి, ఇతర అనుమతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు.బుధవారం కలెక్టర్ తన ఛాంబర్  కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, బీచ్ టూరిజం , టెంపుల్ టూరిజం, క్రింద ఎవరైనా ముందుకు వస్తే మంచి లాభదాయకంగా ఉంటుందని తెలిపారు.

News March 12, 2025

VZM: పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు

image

ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌కు ప‌క‌డ్బంధీగా ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బిఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సంబంధిత అధికారులతో బుధవారం సమీక్షించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 119 ప‌రీక్షా కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు. 1,124 మంది చొప్పున రెండు విడతలకు 2248 మంది ఇన్విజిలేటర్లను నియమిస్తున్నట్లు చెప్పారు.

News March 12, 2025

VZM: ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్ర‌భుత్వ‌ అద‌న‌పు స‌హాయం

image

ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న -గ్రామీణ్‌, అర్బ‌న్, పీఎం జ‌న్‌మ‌న్‌ ప‌థ‌కాల కింద గ‌తంలో మంజూరై నిర్మాణం మ‌ధ్య‌లో నిలిచిపోయిన ఇళ్ల‌ను పూర్తిచేసేందుకు ప్ర‌భుత్వం అద‌న‌పు స‌హాయాన్ని ప్ర‌క‌టించింద‌ని క‌లెక్ట‌ర్ అంబేడ్కర్ వెల్ల‌డించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం ఇళ్ల నిర్మాణానికి మంజూరు చేసిన మొత్తానికి అద‌నంగా రాష్ట్ర ప్ర‌భుత్వం అద‌న‌పు స‌హాయాన్ని అందిస్తుందన్నారు.

error: Content is protected !!