News December 3, 2024

VZM: వినతులు సరే.. స్పందన వస్తుందా?

image

ప్రజా పరిష్కార వేదికకు పెద్ద ఎత్తున బాధితులు క్యూ కడుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి బాధితులు రావడానికి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మండల కార్యాలయాల్లో కూడా వినతులు స్వీకరిస్తున్నారు. భూసమస్యలపై అధిక ఫిర్యాదులు వస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. నిన్న విజయనగరం కలెక్టరేట్‌కు 116 వినుతులు రాగా.. పార్వతీపురం మన్యం జిల్లాలో 108మంది అర్జీలు అందజేశారు. మరి మీ సమస్యకు అధికారులు పరిష్కారం చూపిస్తున్నారా?

Similar News

News February 9, 2026

VZM: సీపీఆర్ విధానంపై పోలీసులకు అవగాహన

image

జిల్లా పోలీసు కార్యాలయంలో ఆర్మ్‌ర్డ్ రిజర్వు సిబ్బందికి CPR శిక్షణ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఎస్పీ దామోదర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గోల్డెన్ అవర్స్‌లో సీపీఆర్ చేయడం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చని అన్నారు. సీపీఆర్ ఎప్పుడు, ఎలా, ఎంతసేపు చేయాలో పూర్తి అవగాహన అవసరమని స్పష్టం చేశారు. డా. రామారావు మాట్లాడుతూ కార్డియాక్ అరెస్టును గుర్తించి సకాలంలో సీపీఆర్ చేస్తే గుండె మళ్లీ పనిచేస్తుందన్నారు.

News February 9, 2026

నేడు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక: VZM కలెక్టర్

image

జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విజయనగరం కలెక్టరేట్‌లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ సమస్యకు సంబంధించి పూర్తి వివరాలతో కలెక్టరేట్‌కు రావాలన్నారు. అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి నేరుగా స్వీకరిస్తారన్నారు.

News February 9, 2026

నేడు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక: VZM కలెక్టర్

image

జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విజయనగరం కలెక్టరేట్‌లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ సమస్యకు సంబంధించి పూర్తి వివరాలతో కలెక్టరేట్‌కు రావాలన్నారు. అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి నేరుగా స్వీకరిస్తారన్నారు.