News December 27, 2024

VZM: షెడ్యూల్డు కులాల సర్వే నివేదిక సచివాలయాల్లో ప్రదర్శన

image

సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు షెడ్యూల్డ్ కులాల సర్వే నివేదికను జిల్లా వ్యాప్తంగా ఉన్న 530 గ్రామ సచివాలయాలు, పట్టణ ప్రాంతాల్లోని 96 వార్డు సచివాలయాల్లో గురువారం ప్రదర్శించారు. దీనిపై ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే తెలపవచ్చని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. ఈ నెల 31వ వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి జనవరి 6వ తేదీలోగా ఆన్లైన్ చేస్తామన్నారు.

Similar News

News November 7, 2025

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

image

గరివిడి మండలం చిన ఐతంవలస వద్ద శుక్రవారం ఆర్టీసీ బస్సు, స్కూటీ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో చీపురుపల్లి మండలం పెరుమాళికి చెందిన కొరగంజి శ్రీలత (48)మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. భర్త సంగం నాయుడుతో కలిసి స్కూటీపై చీపురుపల్లి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది.ఈ దుర్ఘటనలో బస్సు ముందు చక్రం శ్రీలత తలపై నుంచి వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా నాయుడు తీవ్రంగా గాయపడి ప్రాణాలతో బయటపడ్డాడు.

News November 7, 2025

VZM: కంచం చేత పట్టి లైన్‌లో నిల్చున్న కలెక్టర్

image

గంట్యాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును ఆయన పరిశీలించారు. అక్కడ విద్యార్థులకు బోధన చేయడమే కాకుండా వారితో పాటు కంచం పట్టుకుని లైన్లో నిల్చున్నారు. అనంతరం మధ్యాహ్న భోజనం చేసి నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు.

News November 7, 2025

VZM: సబ్సిడీ కింద సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలు

image

సఫాయి కర్మచారి యువతకు NSKFDC పథకం కింద సెప్టిక్‌ ట్యాంక్‌ క్లీనింగ్‌ వాహనాలు సబ్సిడీపై మంజూరు చేయనున్నట్లు SC కార్పొరేషన్‌ ED వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లాకు కేటాయించిన మూడు వాహనాలకు కొత్త లబ్ధిదారుల ఎంపిక జరుగుతోందన్నారు. ఐదుగురు సఫాయి కర్మచారులు కలిసి గ్రూపుగా దరఖాస్తు చేసుకోవాలని, వారిలో ఒకరికి హెవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలని సూచించారు. జిల్లా కార్యాలయానికి దరఖాస్తులు సమర్పించాలన్నారు.