News March 23, 2024

VZM: ‘సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మద్యం సేల్స్ తగ్గింపు’

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మద్యం సేల్స్ తగ్గిస్తామని జిల్లా ఐఎంఎల్ డిపో మేనేజర్ ఎన్ వి రమణ వెల్లడించారు. నెల్లిమర్ల ఐఎంఎల్ డిపోలో శుక్రవారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడారు. డిపో పరిధిలో ఉన్న 279 మద్యం షాపులకు సంబంధించి గత ఏడాది కన్నా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి సేల్స్ తగ్గిస్తామని చెప్పారు. డిపో పరిధిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని విధిగా పాటించనున్నట్లు చెప్పారు.

Similar News

News December 22, 2025

విజయనగరంలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. ప్రజలు తమ సమస్యలతో అర్జీలు సమర్పించాలని, పాత అర్జీల స్లిప్పులు తీసుకురావాలన్నారు. మండలాలు, మున్సిపాలిటీల్లో కూడా పీజీఆర్ఎస్ జరుగుతుందని తెలిపారు.

News December 22, 2025

విజయనగరంలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. ప్రజలు తమ సమస్యలతో అర్జీలు సమర్పించాలని, పాత అర్జీల స్లిప్పులు తీసుకురావాలన్నారు. మండలాలు, మున్సిపాలిటీల్లో కూడా పీజీఆర్ఎస్ జరుగుతుందని తెలిపారు.

News December 21, 2025

VZM: టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా కిమిడి నాగార్జున

image

విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కిమిడి నాగార్జున, ప్రధాన కార్యదర్శిగా ప్రసాదుల లక్ష్మివరప్రసాద్‌ని నియమిస్తూ పార్టీ అధిష్ఠానం ప్రకటన విడుదల చేసింది. కిమిడి నాగార్జున జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ఛైర్మన్‌గా వ్యవహరిస్తుండంగా.. ప్రసాదుల లక్ష్మివరప్రసాద్ యాదవ సంఘం కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తామని వారు పేర్కొన్నారు.