News February 14, 2025
VZM: స్వీట్ షాప్లో కుప్పకూలి మృతి

తగరపువలసలోని ఓ స్వీట్షాప్లో మహిళ మృతిచెందింది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లికి చెందిన రక్షణకుమారి కొంతకాలంగా ఓ స్వీట్ షాప్లో పనిచేస్తోంది. గురువారం సాయంత్రం ఒంట్లో బాగోలేదని ట్యాబ్లెట్ వేసుకుని షాప్కి వెళ్లింది. అక్కడ పని చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు చెప్పారు. భీమిలి పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Similar News
News November 18, 2025
VZM: వారసుల ఎంట్రీ.. వచ్చే ఎన్నికల కోసమేనా..!

విజయనగరం జిల్లా రాజకీయాల్లో యువ నాయకులు ప్రజల్లో కలయ తిరుగుతున్నారు. చీపురుపల్లిలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కుమార్తె డాక్టర్ అనూష విస్తృతంగా పర్యటనలు చేస్తుంటే.. ప్రస్తుత ఎమ్మెల్యే కళావెంకట్రావు కుమారుడు రామ్ మల్లిక్ నాయుడు యాక్టీవ్ అయ్యారు. మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల కుమార్తె శ్రావణి, జడ్పీ ఛైర్మన్ చిన్న శ్రీను కుమార్తె సిరి సహస్ర సైతం వివిధ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.
News November 18, 2025
VZM: వారసుల ఎంట్రీ.. వచ్చే ఎన్నికల కోసమేనా..!

విజయనగరం జిల్లా రాజకీయాల్లో యువ నాయకులు ప్రజల్లో కలయ తిరుగుతున్నారు. చీపురుపల్లిలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కుమార్తె డాక్టర్ అనూష విస్తృతంగా పర్యటనలు చేస్తుంటే.. ప్రస్తుత ఎమ్మెల్యే కళావెంకట్రావు కుమారుడు రామ్ మల్లిక్ నాయుడు యాక్టీవ్ అయ్యారు. మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల కుమార్తె శ్రావణి, జడ్పీ ఛైర్మన్ చిన్న శ్రీను కుమార్తె సిరి సహస్ర సైతం వివిధ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.
News November 18, 2025
VZM: వినతులు కుప్పల తెప్పలు.. పరిష్కారం ఏ స్థాయిలో?

ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లో జరుగుతున్న PGRS కార్యక్రమానికి ప్రజల నుంచి వినతులు పోటెత్తున్నాయి. వాటి పరిష్కారం ఏ స్థాయిలో ఉందనేది ప్రశ్నార్ధకంగా మారింది. వినతుల పరిష్కారం అంతంత మాత్రమేనని స్వయంగా అర్జీదారులే ఆరోపిస్తున్న పరిస్థితి. వినతుల పరిష్కారానికి కలెక్టర్ రాంసుందర్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో సిబ్బంది లైట్ తీసుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.


