News January 5, 2025
VZM: హైందవ శంఖారావానికి తరలి వెళ్లిన ఉమ్మడి జిల్లా వాసులు

విజయవాడలోని కేసరపల్లిలో హైందవ శంఖారావం నినాదంతో భారీ బహిరంగ సభ ఆదివారం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మహాసభకు ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన పలువురు భక్తులు, హిందూ సంఘాల సభ్యులు విజయవాడకు శనివారం పయనమయ్యారు. విజయనగరం, పార్వతీపురం జిల్లా కేంద్రాల నుంచి ప్రైవేట్ బస్సుల్లో తరలి వెళ్తున్నారు. మరి కొంతమంది ట్రైన్లను ఆశ్రయించారు.
Similar News
News November 17, 2025
VZM: ‘నవంబర్ 30లోగా గృహాల సర్వే పూర్తి చేయాలి’

గృహాల కోసం దరఖాస్తులు చేసిన లబ్ధిదారులపై జరుగుతున్న సర్వేను నవంబర్ 30లోపు పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి సంబంధిత అధికారులకు సోమవారం ఆదేశించారు. ప్రభుత్వం గడువు నిర్ణయించినందున, ప్రతి అర్హత గల దరఖాస్తుదారుని వివరాలు సమగ్రంగా పరిశీలించి, ఎంపీడీవోలు యాప్లో వివరాలు నమోదు చేయాలని స్పష్టం చేశారు. సర్వేలో పారదర్శకత, కచ్చితత్వం పాటించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు.
News November 17, 2025
VZM: ‘సివిల్ సర్వీసెస్లో ఉచిత శిక్షణ’

ఏపీ వెనుకబడిన సంక్షేమ, సాధికారత శాఖ ఆధ్వర్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ అభ్యర్థులకు సివిల్ సర్వీసెస్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ శాఖాధికారిణి జె.జ్యోతిశ్రీ తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 25లోపు ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం డిసెంబర్ 5న అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తామన్నారు. పూర్తి వివరాలకు 96035 57333, 98668 86844 నంబర్లను సంప్రదించాలన్నారు.
News November 17, 2025
VZM: ‘సివిల్ సర్వీసెస్లో ఉచిత శిక్షణ’

ఏపీ వెనుకబడిన సంక్షేమ, సాధికారత శాఖ ఆధ్వర్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ అభ్యర్థులకు సివిల్ సర్వీసెస్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ శాఖాధికారిణి జె.జ్యోతిశ్రీ తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 25లోపు ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం డిసెంబర్ 5న అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తామన్నారు. పూర్తి వివరాలకు 96035 57333, 98668 86844 నంబర్లను సంప్రదించాలన్నారు.


