News January 5, 2025
VZM: హైందవ శంఖారావానికి తరలి వెళ్లిన ఉమ్మడి జిల్లా వాసులు

విజయవాడలోని కేసరపల్లిలో హైందవ శంఖారావం నినాదంతో భారీ బహిరంగ సభ ఆదివారం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మహాసభకు ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన పలువురు భక్తులు, హిందూ సంఘాల సభ్యులు విజయవాడకు శనివారం పయనమయ్యారు. విజయనగరం, పార్వతీపురం జిల్లా కేంద్రాల నుంచి ప్రైవేట్ బస్సుల్లో తరలి వెళ్తున్నారు. మరి కొంతమంది ట్రైన్లను ఆశ్రయించారు.
Similar News
News October 3, 2025
VZM: అమ్మ పండగకు వేలాయే..

ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి పండగకు సమయం ఆసన్నమైంది. అమ్మవారి ఉత్సవాలకు సెప్టెంబర్ 12న జరిగిన పందిరిరాటతో శ్రీకారం చుట్టారు. అదే రోజు అమ్మవారి దీక్షలు చదురుగుడిలో ప్రారంభమయ్యాయి. ఈనెల 6న తొలేళ్ల ఉత్సవం, 7న ప్రధాన ఘట్టమైన సిరిమాను సంబరం జరగనుంది. 14న పెద్ద చెరువులో తెప్పోత్సవం జరగనుంది. ఉత్సవాల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.
News October 3, 2025
విజయనగరం జిల్లాలో వర్షపాతం వివరాలు..

వాయుగుండం కారణంగా విజయనగరం జిల్లా వ్యాప్తంగా గురువారం భారీ వర్షం కురిసింది. జిల్లా మొత్తం సరాసరి 28.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గరివిడిలో 88.6 మి.మీ., మెంటాడలో 34.6, గుర్లలో 80.0, చీపురుపల్లిలో 68, నెల్లిమర్లలో 66.8, వంగరలో 56.6, తెర్లాంలో 54.4, మెరకముడిదాంలో 51.2, దత్తిరాజేరులో 47.6 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. దీంతో అనేక ప్రాంతాల్లో వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.
News October 3, 2025
VZM: జిల్లా స్థాయిలో బెస్ట్ స్వచ్ఛత గ్రీన్ అంబాసిడర్లు వీళ్లే

జిల్లాస్థాయి అవార్డులలో బెస్ట్ స్వచ్ఛత గ్రీన్ అంబాసిడర్లుగా పలువురు ఎంపికయ్యారని రాం సుందరరెడ్డి రెడ్డి గురువారం తెలిపారు. బాడంగి మండలం తెంటు వలస పంచాయతీ నుంచి బి.భీమయ్య దాసు, విజయనగరం మండలం చెల్లూరు పంచాయతీ జి.అప్పన్న, చీపురుపల్లి మండలం కర్లాం పంచాయతీ నుంచి బి.అప్పలస్వామి, ఎల్.కోట మండలం పోతం పేట పంచాయతీ నుంచి బోర దేముడు, గజపతినగరం పంచాయతీ నుంచి డి.మహంకాళి ఎంపికయ్యారన్నారు.