News January 5, 2025
VZM: హైందవ శంఖారావానికి తరలి వెళ్లిన ఉమ్మడి జిల్లా వాసులు
విజయవాడలోని కేసరపల్లిలో హైందవ శంఖారావం నినాదంతో భారీ బహిరంగ సభ ఆదివారం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మహాసభకు ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన పలువురు భక్తులు, హిందూ సంఘాల సభ్యులు విజయవాడకు శనివారం పయనమయ్యారు. విజయనగరం, పార్వతీపురం జిల్లా కేంద్రాల నుంచి ప్రైవేట్ బస్సుల్లో తరలి వెళ్తున్నారు. మరి కొంతమంది ట్రైన్లను ఆశ్రయించారు.
Similar News
News January 24, 2025
విశాఖలో విజయనగరం విద్యార్థి మృతి
విజయనగరం జిల్లా యువకుడు గంభీరం డ్యామ్లో మృతి చెందాడు. గరివిడి మండలం కందిపేటకు చెందిన మీసాల నాని విశాఖలో బీటెక్ చదువుతున్నాడు. శుక్రవారం ఆనందపురం మండలం గంభీరం డ్యామ్లో ఈతకు వెళ్లి విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News January 24, 2025
VZM: ‘పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి చర్యలు’
జిల్లా పోలీసు కార్యాలయంలో “పోలీసు వెల్ఫేర్ డే” ను శుక్రవారం నిర్వహించారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఐదుగురు సిబ్బంది నుంచి వినతులు విజ్ఞాపనలు స్వీకరించి, పరిష్కారానికి చర్యలు చేపట్టారు.ఎస్పీ స్వయంగా పుస్తకంలో నోట్ చేసుకొని, వాటి పూర్వాపరాలు పరిశీలించి, పరిష్కరించేందుకు త్వరితగతిన చర్యలు చేపడతానని జిల్లా పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, పోలీసు సంక్షేమానికి ప్రాధాన్యత కల్పిస్తానన్నారు.
News January 24, 2025
VZM: జిల్లాలో 431 గోకులాల నిర్మాణం పూర్తి: కలెక్టర్
జిల్లాలో మొదటి విడతలో భాగంగా 996 గోకులాలు మంజూరు చేయగా, వీటిలో 431 నిర్మాణాలు పూర్తయ్యాయని కలెక్టర్ అంబేడక్కర్ తెలిపారు. సంబంధిత అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. మిగిలిన నిర్మాణాలు పూర్తి చేయాల్సిన బాధ్యత డ్వామా APOలపై ఉందని స్పష్టం చేశారు. రెండో విడత కింద ఫిబ్రవరి మొదటి వారంలో మరో 1000 గోకులాల నిర్మాణాలు ప్రారంభించాలని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న రూ. 2 కోట్ల బిల్లులు అప్లోడ్ చేయాలన్నారు.