News December 26, 2025

VZM: ఆర్టీసీ బస్సు కింద పడి వ్యక్తి మృతి

image

కొత్తవలస జంక్షన్‌లో ఆర్టీసీ బస్సు కింద పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. నిమ్మలపాలెం గ్రామానికి చెందిన ఎస్.పెదరామయ్య (55) కొత్తవలస, ఎస్.కోట రహదారిలో బస్టాప్ వద్ద నుంచి తన గ్రామానికి వెళ్లేందుకు నిలబడ్డాడు. అదే సమయంలో బస్సు రావడంతో ఇటీవల రైల్వే వారు తీసిన కాలవ గట్టు నుంచి జారిపోవడంతో బస్సు చక్రాల కింద పడి మరణించాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News December 27, 2025

స్వేచ్ఛనిస్తే మళ్లీ బీజేపీలోకి..: రాజాసింగ్

image

TG: తాను BJP సైనికుడిని అని, కేంద్ర లేదా రాష్ట్ర నాయకులు తనను పిలిచిన రోజు మళ్లీ పార్టీలో చేరతానని గోషామహల్ MLA రాజాసింగ్ తెలిపారు. అయితే ఆ సమయంలో తనకు పార్టీ పెద్ద నాయకుల నుంచి స్వేచ్ఛ ఇవ్వాలని కోరతానని చెప్పారు. ఒక కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఉండి, ఓ అన్నయ్య గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోతే.. ఏదో ఒక రోజు అతను ఇంటికి తిరిగి రావాల్సిందే అని అన్నారు. అలాగే తాను కూడా రీఎంట్రీ ఇస్తాననే హింట్ ఇచ్చారు.

News December 27, 2025

‘పాలమూరు-రంగారెడ్డి’ని సందర్శించనున్న KCR!

image

TG: అసెంబ్లీ సమావేశాల అనంతరం ప్రజల్లోకి వెళ్లనున్న KCR తొలుత ఉమ్మడి MBNRలో భారీ బహిరంగ సభ పెట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సందర్శిస్తారని సమాచారం. దక్షిణ తెలంగాణకు జీవనాడి అయిన ప్రాజెక్టును కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందని కేసీఆర్ ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే అంశాన్ని జిల్లా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.

News December 27, 2025

చీరాల వాడరేవులో కలెక్టర్ పర్యటన

image

బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ శుక్రవారం చీరాల వాడరేవు, కట్టవారిపాలెం ప్రాంతాల్లో పర్యటించారు. స్థానిక అధికారులతో కలిసి ఆయా ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన.. అక్కడి పరిస్థితులపై అధికారులకు పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో చేరాల ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు, తహశీల్దారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.