News March 2, 2025
VZM: ఇంటర్ పరీక్షలకు 702 మంది విద్యార్థులు గైర్హాజరు

విజయనగరం జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులు 702 మంది గైర్హాజరైనట్లు ఆర్ఐఓ ఆదినారాయణ చెప్పారు. జిల్లావ్యాప్తంగా 166 పరీక్షా కేంద్రాలలో 508 మంది ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు, 194మంది ఓకేషనల్ మొదటి సంవత్సరం విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారు. కొంతమంది విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో హాజరు కాకపోవడంతో గైర్హాజరు కాగా మరికొంతమంది వివిధ కారణాలతో హాజరు కాలేదు.
Similar News
News March 2, 2025
మహిళా సిబ్బందికి యోగా తరగతులు: ఎస్పీ

మహిళా సాధికారత వారోత్సవాల్లో భాగంగా విజయనగరం పోలీసు పరేడ్ గ్రౌండ్లో మహిళా పోలీసు సిబ్బందికి ఆదివారం ప్రత్యేకంగా యోగా తరగతులను నిర్వహించినట్లుగా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. యోగ అనేది శరీరానికి, మనస్సుకి, ఆత్మకు శాంతి కలిగించే ప్రాచీనమైన సాధన అని అన్నారు. యోగ తరగతులు మహిళాలకు ఉపయోగకరమన్నారు.
News March 2, 2025
విజయనగరం వ్యాయమ ఉపాధ్యాయుల జిల్లా సంఘం ఎన్నిక

వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా గోపి లక్ష్మణరావు, కార్యదర్శిగా నల్లా వెంకటనాయుడు ఎంపికయ్యారు. కార్యదర్శిగా ఎన్నికైన వెంకటనాయుడు పెంట జిల్లా పరిషత్ పాఠశాలలో పని చేస్తున్నాడు. విజయనగరంలో ఆదివారం జరిగిన జిల్లా సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరి ఎంపికపై టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వ్యాయమ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని వీరు తెలిపారు.
News March 2, 2025
చీపురుపల్లి కనక మహాలక్ష్మిని దర్శించుకున్న జడ్పీ ఛైర్మన్

చీపురుపల్లి కనకమహాలక్ష్మి జాతర మహోత్సవాలను పురస్కరించుకొని అమ్మవారిని ZPఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆదివారం దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, కమిటీ సభ్యులు శాస్త్రోక్తంగా ఆహ్వానం పలికారు.ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలో మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి ఆశీర్వాదం ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. జాతరలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.