News August 12, 2024
VZM: ఇద్దరు బాలికల కిడ్నాప్..UPDATE

విజయనగరం వాసి ఎం.వెంకటేశ్ 15 రోజులు కిందట తూ.గో జిల్లాకు చెందిన ఇద్దరు బాలికలను కిడ్నాప్ చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశామన్నారు. బాలికలను కాకినాడలోని హాస్టల్లో వదులుతానని తీసుకుపోయినట్లు వారి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ధవళేశ్వరం సీఐ గణేశ్ ఆధ్వర్యంలో రెండు బృందాలుగా పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. వారు నెల్లూరులో ఉన్నట్లు గుర్తించి నిందితుడికి అదుపులోకి తీసుకున్నట్లు సమచారం.
Similar News
News May 8, 2025
ప్రేమ పేరుతో మోసగించిన వ్యక్తికి 10 ఏళ్ల జైలు శిక్ష: SP

బొబ్బిలి పోలీస్ స్టేషన్లో 2022లో నమోదైన మహిళను మోసం చేసిన కేసులో సీతయ్యపేట వాసి దివనాపు అఖిల్ అంబేత్కర్కు పదేళ్ల జైలు శిక్ష, రూ.15వేల జరిమానాను కోర్టు విధించిందని SP వకుల్ జిందల్ గురువారం తెలిపారు. నిందితుడు పాచిపెంటకు చెందిన మహిళను ప్రేమిస్తున్నానని నమ్మించి,శారీరకంగా అనుభవించి మోసం చేశాడనే ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టామన్నారు. ఆధారాలతో కోర్టులో ప్రవేశపెట్టగా నిందితుడికి శిక్ష ఖరారు అయిందన్నారు.
News May 8, 2025
VZM: పతకాలు సాధించిన పోలీసులకు ఎస్పీ అభినందన

ఇటీవల కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళంలో నిర్వహించిన జాతీయస్థాయి డెడ్ లిఫ్ట్ & బెంచ్ ప్రెస్ ఛాంపియన్షిప్ పోటీల్లో వన్ టౌన్ ASI త్రినాథ్, విశ్రాంత HC శంకర్రావు పతకాలు సాధించారు. వారు గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో SP వకుల్ జిందల్ను కలిశారు. ఎస్పీ వాళ్ల ప్రతిభను అభినందించి క్రీడాస్ఫూర్తిని కొనసాగించాలని ఆకాంక్షించారు. 4 బంగారు పతకాలు, 4 వెండి పతకాలు సాధించడం అభినందనీయమన్నారు.
News May 7, 2025
ఎండ తీవ్రత లేని సమయంలో పనులు నిర్వహించాలి: కలెక్టర్

ఉపాధి వేతనదారులకు దినసరి వేతనం పెరిగేలా పనులు చేయించాలని జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉపాధి పనుల తీరు, వేతనదారులు అందుకుంటున్న సగటు వేతనంపై సమీక్షించారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని ఎండ తీవ్రత లేని సమయంలో పనులు నిర్వహించాలని చెప్పారు. ఉదయాన్నే వీలైనంత వేగంగా పని మొదలయ్యేలా చూడాలన్నారు. రెండుపూటలా కనీసం 6 గంటలు పనులు చేయించాలని ఆదేశించారు.