News April 21, 2025

VZM: ఈ నెల 22న జల వనరుల శాఖ మంత్రి నిమ్మల పర్యటన

image

రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఏప్రిల్ 22వ తేదీన జిల్లాలో పర్యటించనున్నారు. ఆరోజు మధ్యాహ్నం 3-00 గంటలకు శ్రీకాకుళం నుంచి విజయనగరం చేరుకొని, 3.30 గంటలకు నెల్లిమర్ల మండలంలోని తారకరామ తీర్థసాగరం ప్రాజెక్టు చేరుకొని పనులను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 4.00 నుంచి 5.30 గంటల వరకు ప్రాజెక్ట్ పనులు, పునరావాసం తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.

Similar News

News July 6, 2025

భవాని దేశానికే గర్వకారణం: హోం మంత్రి అనిత

image

కజకిస్థాన్‌లో జరుగుతున్న ఏషియన్ యూత్ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్‌లో మూడు స్వర్ణ పథకాలు సాధించిన విజయనగరం జిల్లా కొండకరకాం గ్రామానికి చెందిన రెడ్డి భవానీని హోంమంత్రి వంగలపూడి అనిత అభినందించారు. ఈమె దేశానికి గర్వకారణం అని మంత్రి పేర్కొన్నారు. ఆమె ఎంతోమందికి స్ఫూర్తిదాయకం అన్నారు. భవాని మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. తగిన ప్రోత్సాహం అందిస్తామన్నారు.

News July 6, 2025

జిందాల్ భూముల వ్యవహారంపై స్పందించిన మంత్రి

image

జిందాల్ భూముల వ్యవహారంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ‘ఎక్స్’ వేదికగా ఆదివారం స్పందించారు. జిందాల్ భూముల్లో MSME పార్కుల అభివృద్ధి ప్రభుత్వ ప్రతిపాదనలో ఉందని, ఆ పార్కుల్లో ఏ పరిశ్రమలు వస్తాయనేది ఇంకా స్పష్టత లేదన్నారు. పరిశ్రమల ఏర్పాటు చేస్తేనే నీరు సరఫరాపై ఆలోచించాల్సి ఉందని పేర్కొన్నారు. నిర్వాసిత రైతులకు ఇంకా ఏమైనా పెండింగ్ సమస్యలుంటే వాటిని ప్రభుత్వం తప్పకుండా పరిష్కరిస్తుందన్నారు.

News July 6, 2025

హెల్మెట్ ధరించి రక్షణ పొందండి: ఎస్పీ

image

ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి రక్షణ పొందాలని విజయనగరం ఎస్పీ వకుల్ జిందల్ ఆదివారం సూచించారు. హెల్మెట్ ధరించకపోవడం వల్లే ఎక్కువ మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నారన్నారు. ప్రమాదాల్లో తలకు తీవ్ర గాయాలై గోల్డెన్ అవర్స్‌లో చికిత్స అందక ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. హెల్మెట్ ధరిస్తే దెబ్బలు తగిలినప్పటికీ ప్రాణాలతో బతికే అవకాశం ఉందన్నారు.