News August 21, 2025
VZM: ఏసీబీ వలలో వీఆర్వో

విజయనగరం జిల్లాలోని వేపాడ మండలం సింగరాయి గ్రామంలో వీఆర్వోగా పనిచేస్తున్న సత్యవతి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు గురువారం చిక్కారు. ఓ రైతు నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ రైడ్కు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News August 22, 2025
VZM: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ VRO

వేపాడ మండలం సింగరాయ VROగా పని చేస్తున్న కే.సత్యవతి ఏసీబీ వలలో చిక్కింది. విజయనగరం DSP రమ్య అందించిన వివరాల ప్రకారం.. రెవెన్యూ భూములకు ఓ రైతు ముటేషన్కు దరఖాస్తు చేసుకోగా VRO రూ.1.70 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో గురువారం సాయంత్రం రైతు వేపాడ కల్లాల వద్ద రూ.లక్ష VROకి ఇస్తుండగా పట్టుబడినట్లు చెప్పారు. MRO కార్యాలయంలో రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు.
News August 21, 2025
దివ్యాంగులకు అండగా నిలబడండి: చిన్న శ్రీను

దివ్యాంగుల పింఛన్లు పొందుతూ అనర్హత నోటీసులు అందుకున్న బాధితులకు ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీటీసీలు అండగా నిలబడాలని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గురువారం పిలుపునిచ్చారు. తొలగించిన పింఛన్ల పునః పరిశీలనకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిన నేపథ్యంలో వాస్తవంగా అర్హత కలిగిన వారిని గుర్తించి ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తులు చేసుకునేందుకు సహకరించాలన్నారు.
News August 21, 2025
గణేశ్ మండపాల ఏర్పాటుకు ఎస్పీ సూచనలు ఇవే..

గణేశ్ మండపాల ఏర్పాటుకు విజయనగరం ఎస్పీ వకుల్ జిందాల్ గురువారం పలు సూచనలు చేశారు.
➣ఎటువంటి చలానాలు చెల్లించాల్సిన అవసరం లేదు
➣సింగిల్ విండో విధానంతో https://ganeshutsav.net లింక్ ద్వారా అనుమతులు
➣విగ్రహం ఎత్తు, మండపం ఎత్తు వివరాలు తప్పనిసరి
➣కమిటీ సభ్యుల పేర్లు, ఫోన్ నంబర్లు, అనుపు తేదీ ముందే చెప్పాలి
➣NOC పొందిన తరువాత ప్రింట్ తీసుకొని మండపంలో భద్రపరచాలి