News May 8, 2024
VZM: ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఐటిఐ కళాశాలల్లో ప్రవేశాలకు ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్, జిల్లా కన్వీనర్ టీవీ గిరి బుధవారం ఓ ప్రకటనలో కోరారు. iti.ap.gov.in వెబ్సైట్ ద్వారా అభ్యర్థులు వచ్చే నెల 10వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. వెల్డర్, ప్లంబర్లకు 8వ తరగతి, మిగతా అన్ని ట్రేడ్ లకు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు.
Similar News
News September 27, 2025
VZM: రేపటి నుంచి అఖిలభారత డ్వాక్రా బజార్

దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ స్వయం సహాయక సంఘాలు రూపొందించే ఉత్పత్తుల ప్రదర్శనకు అఖిల భారత డ్వాక్రా బజార్ గొప్ప వేదికగా నిలవనుందని కలెక్టర్ రామ సుందర్ రెడ్డి పేర్కొన్నారు. తన ఛాంబర్లో మీడియాతో శనివారం మాట్లాడారు. ఆదివారం నుంచి మనందరికీ అందుబాటులో విజయనగరంలో ప్రారంభంకానున్న ఈ ప్రదర్శనను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
News September 27, 2025
VZM: ఈ నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలు పెరిగే అవకాశం..!

జిల్లాలోని రాజాం నియోజకవర్గంలో 17, బొబ్బిలిలో 27, చీపురుపల్లిలో 4, గజపతినగరంలో 3, నెల్లిమర్లలో 4, విజయనగరంలో 61, ఎస్.కోట నియోజకవర్గంలో 10 మొత్తం 126 పోలింగ్ కేంద్రాల్లో 1200 కంటే ఎక్కువగా ఓటర్లు ఉన్నారు. పోలింగ్ కేంద్రాల మార్పులు, తరలింపులు, కొత్త కేంద్రాల ఏర్పాటుకు ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని DRO శ్రీనివాసమూర్తి స్పష్టం చేశారు.
News September 27, 2025
పొక్సో కేసులో వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష: SP

పొక్సో కేసులో జమ్ము నారాయణపట్నానికి చెందిన అప్పారావుకు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.5వేల జరిమానాను కోర్టు విధించిందని SP దామోదర్ శుక్రవారం తెలిపారు. 7 ఏళ్ల బాలికను ఇంట్లోకి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడనే తల్లి ఫిర్యాదు మేరకు.. పోలీసులు దర్యాప్తు చేపట్టి కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేశారన్నారు. నేరం రుజువు కావడంతో 10 నెలల్లోనే శిక్ష ఖరారైందన్నారు. బాధితురాలికి రూ.3లక్షల పరిహారం మంజూరైందన్నారు.