News November 17, 2025

VZM: ఒకే వేదికపై రాజకీయ దిగ్గజాలు

image

విజయనగరం జిల్లా రాజకీయ దిగ్గజాలు ఒకే వేదికను పంచుకున్నారు. జిల్లా కేంద్రంలో తూర్పుకాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కార్తీక వనభోజన మహోత్సవం జరిగింది. వనభోజనాలకి వైసీపీ, టీడీపీ, జనసేన ముఖ్య నాయకులు హాజరై ఒకే వేదికపై ఆశీనులయ్యారు. మంత్రి శ్రీనివాస్, చీపురుపల్లి ఎమ్మెల్యే కళావెంకటరావు, జనసేన నేత పడాల అరుణ, వైసీపీ నేతలు చిన్నశ్రీను, బొత్స ఝాన్సీ, తదితర నేతలు ఒకే వేదికపై కనిపించారు.

Similar News

News November 17, 2025

ఈ మాస్క్‌తో అవాంఛిత రోమాలకు చెక్

image

చాలామంది అమ్మాయిలను వేధించే సమస్య అవాంఛిత రోమాలు. వంశపారంపర్యం, హార్మోన్ల అసమతుల్యత, పలు అనారోగ్యాలు, కొన్ని మందులు వాడటం వల్ల ఇవి వస్తాయి. వీటిని తగ్గించాలంటే స్పూన్ జెలటిన్ పొడి, పాలు, తేనె, పసుపు కలిపి క్లీన్ చేసిన ముఖానికి అప్లై చేసుకోవాలి. కనుబొమ్మలు, కంటికి అంటకుండా మాస్క్ వేయాలి. 20 నిమిషాల తర్వాత మృదువుగా తొలగించాలి. తర్వాత ఐస్ క్యూబ్స్‌తో ముఖాన్ని రుద్ది మాయిశ్చరైజర్ రాస్తే సరిపోతుంది.

News November 17, 2025

ఈ మాస్క్‌తో అవాంఛిత రోమాలకు చెక్

image

చాలామంది అమ్మాయిలను వేధించే సమస్య అవాంఛిత రోమాలు. వంశపారంపర్యం, హార్మోన్ల అసమతుల్యత, పలు అనారోగ్యాలు, కొన్ని మందులు వాడటం వల్ల ఇవి వస్తాయి. వీటిని తగ్గించాలంటే స్పూన్ జెలటిన్ పొడి, పాలు, తేనె, పసుపు కలిపి క్లీన్ చేసిన ముఖానికి అప్లై చేసుకోవాలి. కనుబొమ్మలు, కంటికి అంటకుండా మాస్క్ వేయాలి. 20 నిమిషాల తర్వాత మృదువుగా తొలగించాలి. తర్వాత ఐస్ క్యూబ్స్‌తో ముఖాన్ని రుద్ది మాయిశ్చరైజర్ రాస్తే సరిపోతుంది.

News November 17, 2025

నంద్యాల: ‘కొనుగోలు కేంద్రాలపై స్పష్టత ఇవ్వాలి’

image

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై స్పష్టత ఇవ్వాలని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం. హరిబాబు, జిల్లా కార్యదర్శి రామచంద్రుడు డిమాండ్‌ చేశారు. సోమవారం నంద్యాలలో కలెక్టర్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. పంట కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, మద్దతు ధరల అమలు, పంట నష్టపరిహారం చెల్లింపు, ఎన్యూమరేషన్‌లో లోపాలను సవరించాలని కోరారు. కౌలు రైతులకు ప్రభుత్వ పథకాలు అన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.