News January 25, 2026

VZM: ఓటే వజ్రాయుధం

image

ప్రజాస్వామ్య భారతానికి ఓటే ప్రాణాధారం. ఓటు కేవలం వేలిపై వేసే గుర్తు కాదు.. అది దేశ తలరాతను మార్చే అస్త్రం. అందుకే పత్రీ పౌరుడూ తన భాద్యతగా ఓటు వేయాలి. ఈ స్పూర్తిని చాటుతూ నేడు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఓటు ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తారు. కాగా విజయనగరం జిల్లాలో 18-19 ఏళ్ల వయస్సు గల వారిలో కొత్తగా 14,058 మంది పురుషులు, 11,003 మంది మహిళలు కొత్తగా ఓటు హక్కు పొందారు.

Similar News

News January 25, 2026

ట్రాన్స్‌జెండర్లు, దివ్యాంగులకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్

image

విజయనగరం జిల్లాలోని దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్‌లకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఆన్‌లైన్ శిక్షణ, పోటీ పరీక్షల కోచింగ్ అందిస్తోందని విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు వెంకటేశ్వరరావు శనివారం తెలిపారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధం చేయడం, IT/ITES రంగాల్లో ఉపాధి అవకాశాల కోసం నైపుణ్యాభివృద్ధి కల్పిస్తారని పేర్కొన్నారు. అభ్యర్థులు apdascac.ap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News January 25, 2026

కన్నుల పండుగలా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగాలి: ఎస్పీ

image

గణతంత్ర దినోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించాలని SP దామోదర్ అధికారులను ఆదేశించారు. జనవరి 26న పరేడ్ గ్రౌండ్‌లో జరిగే ఏర్పాట్లను ఆయన శనివారం పర్యవేక్షించారు. వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని, ప్రజలు, విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందేలా కార్యక్రమాలు ఉండాలని సూచించారు. వాహనాల పార్కింగ్, తనిఖీలు, శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేయాలన్నారు.

News January 25, 2026

కన్నుల పండుగలా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగాలి: ఎస్పీ

image

గణతంత్ర దినోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించాలని SP దామోదర్ అధికారులను ఆదేశించారు. జనవరి 26న పరేడ్ గ్రౌండ్‌లో జరిగే ఏర్పాట్లను ఆయన శనివారం పర్యవేక్షించారు. వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని, ప్రజలు, విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందేలా కార్యక్రమాలు ఉండాలని సూచించారు. వాహనాల పార్కింగ్, తనిఖీలు, శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేయాలన్నారు.