News December 18, 2025
VZM: కలెక్టర్ల సమావేశంలో మన కలెక్టర్ కీలక ప్రతిపాదన

ప్రతి గ్రామంలో పశుగ్రాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి సూచించారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో బుధవారం ఆయన ఈ ప్రతిపాదన చేశారు. పశుగ్రాస కేంద్రాల ద్వారా పాడి పరిశ్రమ అభివృద్ధి చెందడంతో పాటు పాల ఉత్పత్తి పెరిగి గ్రామీణ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని తెలిపారు. 2016 నుంచి 2019 మధ్య ఈ పథకం అమలులో ఉన్నట్లు గుర్తు చేశారు.
Similar News
News December 18, 2025
విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడి ఎంపికపై పునరాలోచన?

TDP జిల్లా అధ్యక్ష పదవిపై అధిష్ఠానం పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా అధ్యక్షుడిగా ఇటీవల కిమిడి నాగార్జున పేరును అధిష్ఠానం ఖరారు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ప్రస్తుతం DCCB ఛైర్మన్గా నాగార్జునకు ఆ బాధ్యతలు నిర్వహించడమే సవాల్ అని, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రానున్న నేపథ్యంలో.. ఈ రెండు బాధ్యతల్ని నెగ్గుకురావడం సులభం కాదని కొందరు నేతలు అధిష్ఠానంకు తెలిపినట్లు సమాచారం.
News December 18, 2025
రేపు విజయనగరం రానున్న మాజీ ఉపరాష్ట్రపతి

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుక్రవారం విజయనగరం జిల్లాకు రానున్నారు. రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి, సాయంత్రం 4.45 గంటలకు వీటీ.అగ్రహారం వై-జంక్షన్ సమీపంలోని CMR లేఅవుట్కు చేరుకుంటారు. అక్కడ నిర్వహించనున్న ఓ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు విశాఖ బయలుదేరి వెళ్తారు.
News December 18, 2025
VZM: జాతీయ స్థాయి పారా పవర్ లిఫ్టింగ్ పోటీలకు అర్హత

ఉత్తరాఖాండ్ రాష్ట్రంలో జరుగబోయే పారా (దివ్యాంగుల) పవర్ లిఫ్టింగ్ జాతీయ స్థాయి పోటీలకు జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారులు అర్హత సాధించారు. ఈ విషయాన్ని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి.రామస్వామి, జిల్లా అధ్యక్షుడు కె.దయానంద్ గురువారం తెలిపారు. జనవరి 16 నుంచి 18వ తేదీ వరకు జరగబోయే జాతీయ స్థాయి పోటీలలోనూ ప్రతిభ చాటి విజయనగరం జిల్లాకు మంచి పేరు తీసుకుని రావాలని కోరారు.


