News February 14, 2025
VZM: గ్రూప్-2 పరీక్షకు 12 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు

APPSC ఆధ్వర్యంలో ఈ నెల 23న గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. విజయనగరంలో మొత్తం 12 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశామని జేసీ సేతు మాధవన్ తెలిపారు. ఆ రోజు ఉదయం 10 నుంచి 12.30 వరకు, మధ్యాహ్నం 3 నుంచి 5.30 వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేయాలని, పటిష్ఠమైన పోలీసు బందోబస్తు నిర్వహించాలని జేసీ అధికారులను ఆదేశించారు.
Similar News
News September 27, 2025
పైడిమాంబ సిరిమానోత్సవానికి సీఎంకు ఆహ్వానం

ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు అక్టోబర్ 6, 7 తేదీల్లో జరగనున్న సందర్భంగా సీఎం చంద్రబాబుకు ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులు ఆహ్వానం పలికారు. రాష్ట్ర పండగగా జరిగే శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని సీఎంను ఆహ్వానించినట్లు మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి తెలిపారు.
News September 27, 2025
అక్టోబర్ 1న జిల్లాకు సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు అక్టోబర్ 1న జిల్లాలో పర్యటించనున్నారు. దత్తిరాజేరు మండలంలోని దత్తి గ్రామాన్ని సందర్శించి పలువురు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జేసీ సేతుమాధవన్, డీఎస్పీ రాఘవులు, తదితరులు హెలీ ప్యాడ్, సభావేదికకు సంబందించి ఏర్పాట్లును శనివారం పరిశీలించారు. పర్యటనకు సంబందించి షెడ్యూల్ ఇంకా విడుదల కావాల్సి ఉంది.
News September 27, 2025
విచారణ వేగవంతానికి ఈ-సమన్స్ అమలు చేయాలి: VZM SP

విజయనగరం జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లలో పని చేస్తున్న అధికారులు, కోర్టు కానిస్టేబుళ్లు, కోర్టు మోనటరింగ్
అధికారులు, హెచ్సీలతో SP దామోదర్ శనివారం జూమ్ మీటింగు నిర్వహించారు. నమోదైన కేసుల్లో నిందితులకు న్యాయ స్థానాల్లో శిక్షపడేలా చేయడంలో కోర్టు కానిస్టేబుళ్లు, కోర్టు మోనటరింగ్ సిబ్బంది పాత్ర క్రియాశీలకమన్నారు. కేసుల విచారణ మరింత వేగవంతంగా జరిపించేందుకు ఈ-సమన్స్ అమలు చేయాలన్నారు.